iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. రికార్డులందు ఈ రికార్డు వేరయా..!

  • Published Jun 06, 2024 | 3:09 PM Updated Updated Jun 06, 2024 | 3:09 PM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన ఇండియన్ బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన ఇండియన్ బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. రికార్డులందు ఈ రికార్డు వేరయా..!

టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ఐరిష్ బ్యాటర్లు ఏ దశలోనూ క్రీజ్ లో నిలబడే సాహసం చేయలేదు. భారత బౌలర్లను ఎదుర్కొనలేక కేవలం 96 రన్స్ కే కుప్పకూలింది ఐర్లాండ్ టీమ్. ఇక ఈ మ్యాచ్ లో యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా బుల్లెట్స్ లాంటి బంతులతో ఐర్లాండ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్ లో మూడు ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలోనే ఓ రేర్ ఫీట్ ను తన ఖతాలో వేసుకున్నాడు బుమ్రా. ఆ వివరాల్లోకి వెళితే..

సొట్టి ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో టీమిండియా బోణీ కొట్టింది. ఫస్ట్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పేస్ దళం దాటిని తట్టుకోలేక కేవలం 96 రన్స్ కే చాపచుట్టేసింది ఐర్లాండ్. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా, అర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లతో రాణించారు. అనంతరం 97 పరుగుల టార్గెట్ ను 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. రోహిత్ శర్మ(52, రిటైర్డ్ హార్డ్), రిషబ్ పంత్ (36*) పరుగులతో రాణించారు.

కాగా.. ఈ మ్యాచ్ ద్వారా అరుదైన ఘనతను సాధించాడు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ మ్యాచ్ లో 6వ ఓవర్లో బంతిని అందుకున్న బుమ్రా.. ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ చేశాడు. లైన్ లెంగ్త్ బంతులతో ఐరిష్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు ఈ యార్కర్ల కింగ్. ఈ మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి కేవలం 6 రన్స్ మాత్రామే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దాంతో ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు బుమ్రా. టీ20ల్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన భారత బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా ఘనత వహించాడు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ రికార్డును బ్రేక్ చేశాడు. బుమ్రా ఇప్పటి వరకు 63 మ్యాచ్ ల్లో 11 ఓవర్లు మెయిడెన్ చేయగా.. భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్ ల్లో 10 ఓవర్లు మెయిడెన్ చేశాడు. ఇక ఈ జాబితాలో ఉగాండ, కెన్యా బౌలర్లు అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఉగాండ బౌలర్ ఎస్ నుబుసుగా ఏకంగా 15 ఓవర్లు మెయిడెన్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెకండ్ ప్లేస్ లో 12 ఓవర్లు మెయిడెన్ చేసి కేన్యా బౌలర్ సోంగోచ్ ఉన్నాడు.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet