SNP
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శల పర్వం కొనసాగుతోంది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తున్నా.. గెలుపుకు దగ్గరవుతున్నా.. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేసినా.. క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు తగ్గడం లేదు. ప్రస్తుతం రెండో రోజు ముగిసే జరిగి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి.. 162 పరుగుల లీడ్లో కొనసాగుతోంది. రోహిత్ శర్మ 103 పరుగులు చేసి అవుటైనా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 143 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. గిల్ 6 రన్స్ చేసిన నిరాశపర్చినా.. విరాట్ కోహ్లీ 36 రన్స్ చేసి భారీ ఇన్నింగ్స్పై కన్నేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ ఆడి 150కు వెస్టిండీస్ ఆలౌట్ విషయం తెలిసిందే. దీంతో టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది.
ఇలా అన్ని విధాలుగా భారత జట్టు పైచేయి సాధిస్తున్నా.. కెప్టెన్ రోహిత్ శర్మను భారత క్రికెట్ అభిమానులు తిట్టిపోస్తున్నారు. తొలి రోజు రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో అతన్ని ఆస్ట్రేలియాతో గత నెలలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎందుకు ఆడించలేదని రోహిత్ శర్మపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. రెండో రోజు రోహిత్ శర్మ సెంచరీ బాదినా కూడా విమర్శలు తగ్గడం లేదు సరికదా.. మరింత పెరిగాయి. వెస్టిండీస్, శ్రీలంక లాంటి చిన్న దేశాలపై తన ప్రతాపం చూపించే రోహిత్.. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్లపై అందులోనూ.. ఫైనల్స్ వంటి కీలకమైన మ్యాచ్ల్లో, నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం బోల్తా కొడుతుంటాడని, టీమిండియా నిండా ముంచుతుంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ శర్మ సెంచరీ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తన కెరీర్లో 10వ టెస్ట్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. గత నెలలో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్లోని ఓవెల్లో జరిగి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో 15, సెకండ్ ఇన్నింగ్స్లో 43 పరుగులు మాత్రమే చేసిన నిరాశపరిచాడు. ఈ ఫైనల్ అనే కాదు, గతంలో ఐసీసీ ట్రోర్నీలో జరిగిన పలు కీలక మ్యాచ్ల్లోనూ రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. కానీ, వెస్టిండీస్ లాంటి బలహీనమైన టీమ్ ఎదురుకాగానే తన ప్రతాపం చూపిస్తున్నాడంటూ రోహిత్పై మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పరిగెత్తుకెళ్లి రోహిత్ను హగ్ చేసుకున్న జైస్వాల్! కోహ్లీ రియాక్షన్ చూడండి