iDreamPost
android-app
ios-app

భారత్‌కు మూడు గోల్డ్‌ మెడల్స్‌! సత్తా చాటిన తెలుగు అమ్మాయి

  • Published Aug 06, 2023 | 3:46 PM Updated Updated Aug 06, 2023 | 3:46 PM
  • Published Aug 06, 2023 | 3:46 PMUpdated Aug 06, 2023 | 3:46 PM
భారత్‌కు మూడు గోల్డ్‌ మెడల్స్‌! సత్తా చాటిన తెలుగు అమ్మాయి

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆర్చరీలో భారత్‌కు పతకాల పంట పండింది. భారత ఆర్చర్ అదితీ గోపీచంద్ స్వామి సంచలనం సృష్టిస్తూ.. అత్యంత చిన్న వయసులో వరల్డ్‌ చాంపియన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న తొలి ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ పోటీల్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కూడా కాంస్యంతో రాణించింది. కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో 17 ఏళ్ల అదితి, పురుషుల విభాగంలో 21 ఏళ్ల ఓజాస్‌ ప్రవీణ్‌ స్వర్ణాలు గెలిచారు. వీళ్లిద్దరూ కొత్త వరల్డ్‌ చాంపియన్లుగా అవతరించారు.

ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ఎంతో హోరాహోరీగా, ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆరో సీడ్‌ అదితి 149-147 స్కోరుతో మెక్సికో ఆర్చర్‌ ఆండ్రియా బెకెర్రానోను ఓడించింది. దీంతో స్వర్ణం ఆమె సొంతమైంది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్‌కే చెందిన రెండో సీడ్‌ జ్యోతి సురేఖను కూడా అదితి ఓడించింది. సురేఖపై 149-145 స్కోరుతో గెలిచింది. దీంతో కాంస్య పతకం కోసం సురేఖ పోటీ పడింది. ఈ పోటీలో 150కి 150 పాయింట్లు సాధించిన ఆమె.. మూడో స్థానంలో నిలిచి కాంస్యం తన ఖాతాలో వేసుకుంది.

మొత్తం మీద వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో సురేఖకు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు 2019లో కూడా కాంస్యం సాధించింది. ఆ తర్వాత 2021లో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది. ఇక పురుషుల ఫైనల్ కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ప్రవీణ్‌ 149 పాయింట్లు సాధించి, నెదర్లాండ్స్ ఆర్చర్ స్కోసెర్‌ మైక్‌‌పై విజయం సాధించాడు. భారత్‌ ఖాతాలో మొత్తం మూడు స్వర్ణాలు, ఓ కాంస్యం చేరాయి. మరి భారత క్రీడాకారులు మూడు స్వర్ణాలు గెలవడం, అలాగే తెలుగమ్మాయి కాంస్యం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అమెరికాలో కొత్త బిజినెస్‌ ప్రారంభించిన రోహిత్‌ శర్మ

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet