Shubman Gill: ఆ విషయంలో రోహిత్​ను ఫాలో అవుతున్న గిల్.. ఇంక అన్ని కప్పులు మనవే!

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడు శుబ్​మన్ గిల్. అతడి బాటలో నడుస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడు శుబ్​మన్ గిల్. అతడి బాటలో నడుస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.

టీమిండియా ఇంకో సిరీస్​ను గెలుచుకుంది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్​ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది భారత్. ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్​ను పట్టేసింది. ఇవాళ జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది యంగ్ ఇండియా. తొలుత బ్యాటింగ్​కు దిగిన జింబాబ్వే ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​ మొదలుపెట్టిన మెన్ ఇన్ బ్లూ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు శుబ్​మన్ గిల్ (39 బంతుల్లో 58 నాటౌట్), యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 నాటౌట్) ఆఖరి వరకు నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేశారు. ఎంత ప్రయత్నించినా వీళ్లను ఔట్ చేయలేకపోయారు ఆతిథ్య బౌలర్లు.

గిల్​ 6 బౌండరీలు, 2 సిక్సులు కొట్టగా.. జైస్వాల్ 13 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు బాదాడు. ఇద్దరూ కలసి ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడారు. బౌండరీల వర్షం కురిపించి ఇంకో 28 బంతులు ఉండగానే మ్యాచ్​ను ముగించారు. అద్భుతమైన బ్యాటింగ్​తో అలరించిన జైస్వాల్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్​ కైవసం కావడంతో ఆఖరి మ్యాచ్ నామమాత్రం కానుంది. కాబట్టి చివరి టీ20లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్​లో ప్రయోగాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని పక్కనబెడితే.. జింబాబ్వే టూర్​లో భారత కెప్టెన్ శుబ్​మన్ గిల్ ఆకట్టుకుంటున్నాడు. బ్యాటర్​గానే గాక సారథిగానూ రాణిస్తున్నాడు. ఫీల్డ్ పొజిషన్స్, బౌలింగ్​ ఛేంజెస్​లో రోహిత్ శర్మను తలపిస్తున్నాడు. ముఖ్యంగా ఆ విషయంలో అయితే అతడి వారసుడిగా కనిపిస్తున్నాడు.

వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్​ రోహిత్ శర్మ ఎప్పుడూ ఒకే మాట చెబుతూ ఉంటాడు. దాన్నే ఆచరిస్తుంటాడు కూడా. స్వార్థం లేకుండా ఆడాలి. రికార్డులు, మైల్​స్టోన్స్​ను పట్టించుకోకుండా జట్టు మేలును దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని సహచరులకు నూరి పోస్తుంటాడు. ఈ ఆలోచన వర్కౌట్ అవడంతో పొట్టి కప్పులో భారత్ విజేతగా నిలిచింది. మెగా టోర్నీలో రోహిత్ తాను ఇదే ఐడియాతో ఆడటమే గాక ఇతరులను కూడా అలాగే ఆడించాడు. ఇప్పుడు ఇదే బాటలో గిల్ ప్రయాణిస్తున్నాడు. ఇవాళ జింబాబ్వేతో మ్యాచ్​లో సరిగ్గా ప్లాన్ చేస్తే జైస్వాల్ సెంచరీ కొట్టేవాడు.

సెంచరీకి 7 పరుగుల దూరంలో ఆగిపోయాడు జైస్వాల్. అయితే శుబ్​మన్ మ్యాచ్ సిచ్యువేషన్​కు తగ్గట్లు ఆడుతూ, అతడ్ని కూడా అదే టెంపోలో ఆడిస్తూ పోయాడు. సెల్ఫిష్ అనే బ్యాడ్ నేమ్, సెంచరీ మిస్ చేయించాడనే అప్రతిష్ట వస్తుందని భయపడకుండా మ్యాచ్​ను సాధ్యమైనంత వేగంగా ఫినిష్​ చేయించాడు. సెంచరీలు, రికార్డుల కంటే జట్టు గెలుపు, అపోజిషన్ టీమ్స్ మీద​ డామినేషన్ ముఖ్యమని చెప్పకనే చెప్పాడు. ఇలాగే కంటిన్యూ చేస్తే మన టీమ్​ మరిన్ని కప్పులు కొట్టడం పక్కా అనే చెప్పాలి. మరి.. రోహిత్ బాటలో గిల్ నడవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments