Nidhan
సక్సెస్లో ఉన్నప్పుడు మిస్టేక్స్ కనిపించవు. అదే ఓటమి ఎదురైతే ఒకేసారి ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ఇప్పుడు టీమిండియా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే ఇందులో నుంచి బయటపడాలంటే ఒక విక్టరీని గుర్తుచేసుకోవాలి.
సక్సెస్లో ఉన్నప్పుడు మిస్టేక్స్ కనిపించవు. అదే ఓటమి ఎదురైతే ఒకేసారి ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ఇప్పుడు టీమిండియా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే ఇందులో నుంచి బయటపడాలంటే ఒక విక్టరీని గుర్తుచేసుకోవాలి.
Nidhan
ఏ గేమ్లోనైనా గెలుపోటములు సహజం. అందుకు క్రికెట్ కూడా మినహాయింపేమీ కాదు. ఛాంపియన్స్ లాంటి టీమ్స్ కూడా ఘోర ఓటమిని చవిచూసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి త్వరగా బయటపడాలి. అప్పుడే కొత్త చరిత్రను సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారత్ కూడా సరిగ్గా ఇదే ఫేజ్లో ఉంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడిన టీమిండియా.. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి కప్ను చేజార్చుకుంది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న రోహిత్ సేనకు సఫారీ టూర్లో మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ను డ్రా చేసిన భారత్.. వన్డే సిరీస్ను కైవసం చేసుకొని ఫుల్ జోష్లో కనిపించింది. కానీ టెస్ట్ సిరీస్లోని మొదటి మ్యాచ్లో చిత్తుగా ఓడింది. ఇన్నింగ్స్ 32 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ తరుణంలో ఒక విక్టరీని టీమిండియా ప్లేయర్లు గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రొటీస్తో మొదటి టెస్ట్లో ఓటమితో సిరీస్ను గెలిచే ఛాన్స్ను మిస్ చేసుకుంది భారత్. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లోనూ ఆరో స్థానానికి పడిపోయింది. దీంతో ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ కూడా నిరాశలో ముగినిపోయారు. కానీ ఇప్పటికి ఇంకా ఏమీ అయిపోలేదు. ఒక విజయాన్ని గుర్తుచేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఆ విక్టరీని గుర్తుచేసుకొని చెలరేగితే సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించొచ్చు. అంత జోష్ నింపే ఆ విక్టరీ ఆస్ట్రేలియా మీద సాధించింది. అది 2018వ సంవత్సరం. భారత్-ఆసీస్ మధ్య టెస్ట్ సిరీస్. సిరీస్కు డిసైడర్గా మారిన మూడో టెస్ట్లో టీమిండియా నెగ్గింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన మన జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 443 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
భారత బ్యాటర్లలో ఛటేశ్వర్ పుజారా (106), మయాంక్ అగర్వాల్ (76), రోహిత్ శర్మ (63 నాటౌట్) రాణించారు. ముఖ్యంగా పుజారా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో అలరించాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 151 రన్స్కే కుప్పకూలింది. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (6 వికెట్లు) చెలరేగి బౌలింగ్ చేశాడు. అనంతరం టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 106 రన్స్కు 8 వికెట్ల దగ్గర డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆతిథ్య కంగారూ జట్టు 261 రన్స్కు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 137 రన్స్తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత నాలుగో టెస్ట్ను డ్రా చేసుకొని సిరీస్ను సొంతం చేసుకుంది టీమిండియా. ఆసీస్పై గ్రాండ్ విక్టరీకి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ అందరూ దాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆసీస్ను వారి సొంతగడ్డపై చిత్తుగా ఓడించిన ఆ మూమెంట్స్ను భారత ప్లేయర్లు గుర్తుచేసుకుంటే సఫారీల పని పట్టడం ఈజీ అని అంటున్నారు. ఆ మ్యాచ్లో ఆడిన కోహ్లీ, రోహిత్, బుమ్రా మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయాలని కోరుకుంటున్నారు. మరి.. సౌతాఫ్రికాతో చివరి టెస్ట్లో భారత్ మ్యాజిక్ చేస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Team India: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్.. దరిద్రం ఇలా పట్టుకుందేంటి?
India defeated Australia in the Boxing Day Test “OTD in 2018” under the Leadership of Virat Kohli.
Jasprit Bumrah won the Player of the match award for his terrific bowling performance & Pujara was the star with bat by scoring the hundred. pic.twitter.com/DyB3CPO4Bp
— Johns. (@CricCrazyJohns) December 30, 2023