టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చేసిన ఓ పని వల్ల మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బలయ్యాడు. దీంతో అభిమానులు జైస్వాల్ను ట్రోల్ చేస్తున్నారు.
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చేసిన ఓ పని వల్ల మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బలయ్యాడు. దీంతో అభిమానులు జైస్వాల్ను ట్రోల్ చేస్తున్నారు.
వరల్డ్ కప్-2023 ఫైనల్లో జరిగిన గాయం నుంచి ఇంకా భారత అభిమానులు కోలుకోలేదు. అటు ప్లేయర్లు కూడా ఆ బాధ నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇంతలోనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో మొదలైపోయింది. మరో 7 నెలల్లో పొట్టి ఫార్మాట్లో ప్రపంచ కప్ ఉండటంతో అంతా కొత్తగా ప్రారంభించాల్సిన సమయం వచ్చేసింది. ఫైనల్లో ఓడిన టీమిండియాతో పాటు గెలిచిన ఆసీస్కు కూడా టీ20 వరల్డ్ కప్ జర్నీని మొదలుపెట్టాల్సిన తరుణం వచ్చేసింది. ఈ రెండు టీమ్స్ మధ్య నిన్న వైజాగ్లో ఫస్ట్ టీ20 జరిగింది. మెగా టోర్నీ ఫైనల్లో నిరాశపర్చిన సూర్యకుమార్ యాదవ్.. ఈసారి మాత్రం కంగారూలను వదల్లేదు. రివేంజ్ తీర్చుకుంటూ అద్భుతమైన ఇన్నింగ్స్తో అదరగొట్టాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు కెప్టెన్ సూర్యకుమార్. ఆ జట్టు 20 ఓవర్లు ఆడి 3 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీ హీరో జోష్ ఇంగ్లిస్ (110)కు తోడు స్టీవ్ స్మిత్ (52) కూడా అద్భుతంగా ఆడటంతో భారత్ ముందు భారీ టార్గెట్ను ఉంచింది ఆసీస్. టీ20ల్లో ఇంతవరకు ఇంత భారీ లక్ష్యాన్ని టీమిండియా ఎప్పుడూ ఛేదించలేదు. ఛేజింగ్లో 22 రన్స్కే ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరిగారు. దీంతో మరోమారు కంగారూల చేతుల్లో ఓటమి తప్పదని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ (80) మాత్రం పట్టు వదల్లేదు. ఇషాన్ కిషన్ (58) తోడుగా ప్రత్యర్థి బౌలర్లపై అటాక్కు దిగాడు. వీళ్లిద్దరూ ఫోర్లు, సిక్సులతో విజృంభించడంతో స్కోరు బోర్డు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది.
విజయానికి చేరువలో సూర్య, ఇషాన్ ఔటైనా రింకూ సింగ్ (22 నాటౌట్) మిగిలిన పనిని పూర్తి చేశాడు. ఒక టైమ్లో మ్యాచ్ మన చేతి నుంచి జారిపోతున్నట్లు అనిపించింది. చెత్త షాట్ ఆడి అక్షర్ పటేల్ ఔటవ్వడం, అతడి తర్వాత వచ్చిన రవి బిష్ణోయ్, అక్షర్దీప్ సింగ్లు రనౌట్లుగా వెనుదిరగడంతో టెన్షన్ మొదలైంది. కానీ స్ట్రయిక్లోకి వచ్చిన రింకూ కూల్గా సిక్స్ కొట్టి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. గెలిచిన తర్వాత కూడా తన స్టైల్లో జస్ట్ చేతులు అలా పైకి పెట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్లో జరిగిన ఓ ఘటనతో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విలన్గా మారాడు. రుతురాజ్ గైక్వాడ్తో కలసి ఓపెనింగ్ చేశాడు జైస్వాల్.
ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రుతురాజ్ వికెట్ను భారత్ కోల్పోయింది. జైస్వాల్తో సమన్వయ లోపం కారణంగా గైక్వాడ్ డైమండ్ డకౌట్గా వెనుదిరిగాడు. అయితే ఇందులో అతడి తప్పు లేదు. జైస్వాల్ రన్కు పిలిస్తేనే అతడు వెళ్లాడు. కానీ డెసిజన్ మార్చుకున్న అతను రుతురాజ్ను వెనక్కి వెళ్లిపోమన్నాడు. అప్పటికే సగం క్రీజులోకి వచ్చేయడంతో తిరిగి వెళ్లేసరికి రనౌట్ అయ్యాడు. దీంతో బాధతో తల దించుకొని మౌనంగా వెళ్లిపోయాడు రుతురాజ్. ఫ్యాన్స్ జైస్వాల్ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అతడు తన స్వార్థం కోసం రుతురాజ్ను బలిపశువును చేశాడంటున్నారు. కర్మ ఎవ్వర్నీ వదలదని.. గైక్వాడ్ను ఔట్ చేయించిన కాసేపటికే జైస్వాల్ పెవిలియన్కు చేరడమే దీనికి ఎగ్జాంపుల్ అని మరికొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. రికార్డుల కోసం స్వార్థం చూసుకోకుండా టీమ్ గెలుపు కోసం ఆడు జైస్వాల్ అంటూ సూచిస్తున్నారు. మరి.. జైస్వాల్-రుతురాజ్ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆసీస్తో ఫస్ట్ టీ20.. భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!
It’s Not The First Time Jaiswal Tried Running Out Ruturaj . Congratulations On Cementing Your T20I Opening Spot Jaiswal 👏🏻 .#JioCinema #INDvAUS #RuturajGaikwad pic.twitter.com/Gl1Mt4Apeh
— Mufaddal Vohra (@Mufaddol_Vohra) November 23, 2023
Very bad call by jaiswal , Ruturaj Gaikwad Trusted on his call runs and he stops him at half track #INDvsAUS #INDvAUS #IndianCricket #IPLAuction #ipl2024 #RuturajGaikwad pic.twitter.com/KPsZ1Zudjt
— Ankit bhumla(Gurjar) (@Kuldeep13726336) November 23, 2023