ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 13 ఫోర్లు, 7 సిక్సులతో మాస్ హిట్టింగ్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 13 ఫోర్లు, 7 సిక్సులతో మాస్ హిట్టింగ్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా దుమ్మురేపుతోంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన పర్యాటక టీమ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు మంచి స్టార్ట్ దొరకలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరుకున్నాడు. జేసన్ బెరెన్డార్ఫ్ అతడ్ని ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (0) గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కేన్ రిచర్డ్సన్ బౌలింగ్లో రెగ్యులర్ షాట్ ఆడి ఔటయ్యాడు ఇషాన్. 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. కానీ మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (39) టీమ్ను ఆదుకున్నారు.
రుతురాజ్-సూర్యకుమార్ కలసి మూడో వికెట్కు 57 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. అయితే ఆ తర్వాత సూర్యను కొత్త బౌలర్ ఆరోన్ హార్డీ వెన్కి పంపాడు. ఆరోన్ కెరీర్లో ఇదే ఫస్ట్ వికెట్ కావడం గమనార్హం. అయితే సూర్య తర్వాత వచ్చిన తిలక్ వర్మ (31 నాటౌట్) మాత్రం మరింత అటాకింగ్ గేమ్ ఆడాడు. రుతురాజ్-తిలక్ కలసి మూడో వికెట్కు ఏకంగా 141 పరుగులు జోడించారు. ఇందులో తిలక్ చేసింది తక్కువ రన్సే. ఈ పార్ట్నర్షిప్లో రుతురాజ్ కాంట్రిబ్యూషనే ఎక్కువ. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్లో రుతురాజ్ బ్యాటింగ్ హైలైట్ అని చెప్పాలి. 13 బౌండరీలు బాదిన అతడు.. ఏకంగా 7 సిక్సులతో ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడాడు. రుతురాజ్ ఉతుకుడుతో భారత్ ఏకంగా 222 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది రుతూకు ఫస్ట్ సెంచరీ కావడం విశేషం. ఆసీస్పై టీ20ల్లో సెంచరీ కొట్టిన తొలి భారత బ్యాటర్గానూ అతడు చరిత్ర సృష్టించాడు. మరి.. రుతురాజ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ ఎక్కడ.. ఇంత నిరాశ ఎందుకు?
HUNDRED BY RUTURAJ GAIKWAD…!!!
What an innings by Rutu – his maiden international century. The acceleration has been to the next level by Gaikwad. 🫡 pic.twitter.com/jGDdNAAvt8
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 28, 2023