sai
ఐపీఎల్-2024లో దుమ్మురేపిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డికి బ్యాడ్ లక్. ఎంచక్కా టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడనుకుంటే అది కుదర్లేదు. అతడికి గోల్డెన్ ఛాన్స్ మిస్సైంది.
ఐపీఎల్-2024లో దుమ్మురేపిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డికి బ్యాడ్ లక్. ఎంచక్కా టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడనుకుంటే అది కుదర్లేదు. అతడికి గోల్డెన్ ఛాన్స్ మిస్సైంది.
sai
ఐపీఎల్-2024లో దుమ్మురేపాడు సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో అందరి చూపుల్ని తన వైపునకు తిప్పుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్తో టాప్ బౌలర్లను కూడా హడలెత్తించాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తూ టీమ్కు భారీ స్కోర్లు అందించాడు. సన్రైజర్స్ ఫైనల్ వరకు వెళ్లడంతో ఈ తెలుగోడి పాత్ర ఎంతో ఉంది. ఈ సీజన్లో 303 పరుగులు చేసి.. ఆరెంజ్ ఆర్మీకి సర్ప్రైజ్ ప్యాకేజ్గా మారాడు నితీష్. బౌలింగ్లోనూ కీలక సమయాల్లో బ్రేక్ త్రూలు అందించాడు. అతడి ప్రదర్శనకు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో అతడి ఆట చూసిన చాలా మంది మాజీ క్రికెటర్లు నితీషే భారత్ ఫ్యూచర్ అని ప్రశంసల్లో ముంచెత్తారు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో అతడి పేరు ఉంటుందని అంచనా వేశారు. కానీ అది సాధ్యం కాలేదు.
పొట్టి కప్పులో ఆడే అవకాశం దక్కలేదు. కానీ త్వరలో జరిగే జింబాబ్వే సిరీస్కు టీమ్లోకి నితీష్ రెడ్డిని తీసుకున్నారు సెలెక్టర్లు. దీంతో అతడు బ్లూ జెర్సీని వేసుకొని తెలుగోడి గౌరవాన్ని మరింత పెంచుతాడని అంతా ఆశించారు. అయితే బ్యాడ్ లక్. అతడు గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యాడు. గాయంతో బాధపడుతున్న నితీష్ను జింబాబ్వే సిరీస్ నుంచి తప్పించింది బీసీసీఐ. అతడి స్థానంలో ఆల్రౌండర్ శివమ్ దూబేను రీప్లేస్ చేసింది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో నితీష్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. పాపం.. నితీష్ కష్టం వృథా అయిందని అంటున్నారు. డెబ్యూ కోసం మరికొన్నాళ్లు ఎదురుచూపులు తప్పవని.. అయినా నువ్వో ఛాంపియన్వి, త్వరగా కోలుకొని ఎంట్రీ ఇవ్వు అంటూ ధైర్యం నూరిపోస్తున్నారు. మరి.. నితీష్ టీమిండియాలో ఆడే ఛాన్స్ మిస్సవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
🚨 NEWS 🚨
Shivam Dube replaces Nitish Reddy in the #TeamIndia squad for the series against Zimbabwe. #ZIMvIND
Details 🔽https://t.co/WMktNAIDIx
— BCCI (@BCCI) June 26, 2024