iDreamPost
android-app
ios-app

చెత్తాటలో కోహ్లీని మించిపోతున్నాడు.. సెమీస్​కు ముందు భారత్​ను భయపెడుతున్న స్టార్!

  • Published Jun 26, 2024 | 8:16 PM Updated Updated Jun 26, 2024 | 8:16 PM

టీ20 వరల్డ్ కప్​లో ఓటమి అనేదే లేకుండా సెమీస్​కు దూసుకొచ్చింది భారత్. ఎదురొచ్చిన టీమ్​ను చిత్తు చేస్తూ నాకౌట్ ఫైట్​కు క్వాలిఫై అయింది. పటిష్టమైన ఇంగ్లండ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

టీ20 వరల్డ్ కప్​లో ఓటమి అనేదే లేకుండా సెమీస్​కు దూసుకొచ్చింది భారత్. ఎదురొచ్చిన టీమ్​ను చిత్తు చేస్తూ నాకౌట్ ఫైట్​కు క్వాలిఫై అయింది. పటిష్టమైన ఇంగ్లండ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

  • Published Jun 26, 2024 | 8:16 PMUpdated Jun 26, 2024 | 8:16 PM
చెత్తాటలో కోహ్లీని మించిపోతున్నాడు.. సెమీస్​కు ముందు భారత్​ను భయపెడుతున్న స్టార్!

టీ20 వరల్డ్ కప్​లో ఓటమి అనేదే లేకుండా సెమీస్​కు దూసుకొచ్చింది భారత్. ఎదురొచ్చిన టీమ్​ను చిత్తు చేస్తూ నాకౌట్ ఫైట్​కు క్వాలిఫై అయింది. పటిష్టమైన ఇంగ్లండ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్-2022 సెమీస్​లో ఇంగ్లీష్ జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయింది మెన్ ఇన్ బ్లూ. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తయింది. ఆ మ్యాచ్​లో భారత్ సంధించిన 168 పరుగుల టార్గెట్​ను మరో 24 బంతులు ఉండగానే వికెట్ నష్టపోకుండా ఛేదించింది ఇంగ్లీష్​ టీమ్. దీంతో అది మన టీమ్​కు పీడకలగా మారిపోయింది. అప్పటివరకు బాగా ఆడుతూ వచ్చిన జట్టు.. ఇంగ్లండ్ దెబ్బకు కప్పుకు రెండు అడుగుల దూరంలోనే ఆగిపోయింది. ఆ ఓటమికి ఇప్పుడు రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది రోహిత్ సేన. అందుకు అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతోంది.

కెప్టెన్ రోహిత్ నేతృత్వంలోని బ్యాటింగ్ విభాగం, జస్​ప్రీత్ బుమ్రా ఆధ్వర్యంలోని బౌలింగ్ యూనిట్ భీకర ఫామ్​లో ఉండటంతో ఇంగ్లీష్​ టీమ్​ ఖేల్ ఖతం అని అంతా అంటున్నారు. మనోళ్ల దెబ్బకు బట్లర్ సేన తోకముడవడం గ్యారెంటీ అని.. ఈసారి భారత్​దే కప్పు అని అభిమానులు చెబుతున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా టీమిండియాను ఒక విషయం మాత్రం బాగా టెన్షన్ పెడుతోంది. విరాట్ కోహ్లీ కంటే అతడి ఫెయిల్యూర్​ టీమ్​ను మరింత భయపెడుతోంది. మెగాటోర్నీలో కోహ్లీ సరిగ్గా రాణించడం లేదనేది అందరికీ తెలుసు. ఓపెనర్​గా వస్తూ పరుగులు చేయలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఐసీసీ టోర్నీల్లో హయ్యెస్ట్ రన్ స్కోరర్స్​లో టాప్​లో ఉండే కింగ్.. ఈసారి 66 పరుగులతో లిస్ట్​లో ఎక్కడో కింద ఉన్నాడు. అయితే అతడ్ని మించిన వైఫల్యం జడేజాది. విరాట్ ఫెయిల్యూర్ చాటున జడ్డూ వైఫల్యం ఎవరికీ కనిపించడం లేదు.

ప్రస్తుత వరల్డ్ కప్​లో జడేజా దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 16 మాత్రమే. బౌలింగ్​లో కూడా కేవలం 1 వికెటే తీశాడు. అతడి బౌలింగ్ ఎకానమీ 7.80గా ఉంది. అటు బ్యాటర్​గా, ఇటు బౌలర్​గా అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. గ్రౌండ్ ఫీల్డింగ్​లో రన్స్ కాపాడుతూ టీమ్​కు అండగా నిలుస్తున్నాడు. కానీ అతడి నుంచి ఆఖర్లో విలువైన పరుగులు, వికెట్లను ఆశిస్తోంది జట్టు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో ఒక ఓవర్ వేసి ఏకంగా 17 రన్స్ ఇచ్చుకున్నాడు జడ్డూ. బ్యాటింగ్​ టైమ్​లో భారీ షాట్లు బాదలేక, బౌలింగ్​ టైమ్​లో వికెట్లు తీయలేక టీమ్​కు భారంగా మారాడు జడ్డూ. దీంతో ఇతర ఆటగాళ్ల మీద ఒత్తిడి పెరుగుతోంది. నెక్స్ట్ ఇంగ్లండ్​తో నాకౌట్ మ్యాచ్. అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ జడ్డూ రాణించాలి. జట్టు గెలుపులో అతడు కీలక పాత్ర పోషిస్తే అందరూ మెచ్చుకుంటారు. ఏమాత్రం తేడా వచ్చినా జడేజా టీమ్​కు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. మరి.. సెమీస్​లో జడేజా సక్సెస్ అవుతాడని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.