ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఆఖర్లో ఒక టీమిండియా బ్యాటర్ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. దీంతో అతడిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యాడు.
ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఆఖర్లో ఒక టీమిండియా బ్యాటర్ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. దీంతో అతడిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యాడు.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే భారత అభిమానులు కోలుకుంటున్నారు. ఎన్నో ఆశలు రేపి ఆఖరి మెట్టుపై రోహిత్ సేన బోల్తా పడటాన్ని ఫ్యాన్స్తో పాటు సాధారణ క్రికెట్ ప్రేమికులు కూడా తట్టుకోలేకపోయారు. అయితే అయ్యిందేదో అయిపోయింది.. ఫ్యూచర్లోనైనా ఐసీసీ ట్రోఫీలు నెగ్గాలని కోరుకుంటున్నారు. అలాంటి అభిమానులకు ఊరటను ఇస్తూ ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ను విజయంతో ప్రారంభించింది టీమిండియా. విశాఖపట్నం వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో నెగ్గి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. అయితే మ్యాట్ షార్ట్ (13) ఔటైనా జోష్ ఇంగ్లిస్ (110)తో కలసి భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు స్టీవ్ స్మిత్ (52). ముఖ్యంగా ఇంగ్లిస్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 8 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే ఇంగ్లిస్ డామినేషన్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆఖరి ఓవర్లలో క్విక్గా రన్స్ చేయడంలో మార్కస్ స్టొయినిస్ (7 నాటౌట్), టిమ్ డేవిడ్ (19 నాటౌట్) ఫెయిలయ్యారు. దీంతో 20 ఓవర్లకు 208 రన్స్ చేసింది ఆసీస్. చివర్లో ఆ టీమ్ బ్యాటర్లను పేసర్ ముకేష్ కుమార్ బాగా కట్టడి చేశాడు. ఆ తర్వాత ఛేజింగ్ మొదలుపెట్టిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) డైమండ్ డకౌట్గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (21)తో సమన్వయ లోపం కారణంగా గైక్వాడ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే జైస్వాల్ కూడా స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ టైమ్లో ఇషాన్ కిషన్ (58)తో జతకట్టిన సూర్యకుమార్ యాదవ్ (80) చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సులు కొడుతూ ఈ జోడీ ఆసీస్ను కంగారుపెట్టింది. వీళ్లిద్దరే మ్యాచ్ను ఫినిష్ చేస్తారనిపించింది. కానీ భారీ షాట్స్ కొట్టేందుకు ప్రయత్నించి ఇద్దరూ వికెట్లు పారేసుకున్నారు. తిలక్ వర్మ (12) కూడా భారీ షాట్ ఆడేందుకు ట్రై చేసి ఔటయ్యాడు. అయితే రింకూ సింగ్ (22) చివరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు.
ఆసీస్తో ఫస్ట్ టీ20లో భారత్ సునాయాసంగా గెలవాల్సింది. కానీ స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చేసిన ఓ తప్పు కారణంగా పీకల మీదకు తెచ్చుకుంది. విజయానికి మరో 2 రన్స్ కావాల్సిన టైమ్లో ఇంకో 3 బంతులు ఉన్నాయి. సింగిల్స్ లేదా డబుల్స్ తీసి మ్యాచ్ను ఫినిష్ చేయొచ్చు. కానీ భారీ సిక్స్ కొట్టి గెలిపిద్దామనుకున్న అక్షర్.. అబాట్ వేసిన బాల్ను గట్టిగా కొట్టాడు. కానీ బాల్ అక్కడే లేవడంతో బౌలర్ అబాట్ క్యాచ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవి బిష్ణోయ్, అక్షర్దీప్ సింగ్లు రింకూకు స్ట్రైక్ ఇవ్వాలనే ఉద్దేశంతో రన్కు ప్రయత్నించి రనౌట్ అయ్యారు.
చివర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నా రింకూ సింగ్ కూల్గా సిక్స్ కొట్టి గెలిపించాడు. అయితే కీలక సమయంలో అక్షర్ చెత్త షాట్ కొట్టి ఔటవ్వడంతో అతడిపై కెప్టెన్ సూర్యకుమార్ సీరియస్ అయ్యాడు. ఆ టైమ్లో డగౌట్లో కూర్చుకున్న మిస్టర్ 360 చేయి చూపిస్తూ.. ఇదేం చెత్త షాట్ అన్నట్లు సైగ చేశాడు. అక్షర్పై సూర్య సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. అక్షర్ చెత్త షాట్ ఆడి ఔట్ అవ్వడంపై సూర్య సీరియస్ అవ్వడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నిన్న రింకూని హగ్ చేసుకున్న ఇతను ఎవరు? అంతా ఇతని పుణ్యమే!