సైలెంట్ గా OTT లో మణిరత్నం మలయాళ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

Paradise Movie OTT: మలయాళ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ఓ మలయాళ సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

Paradise Movie OTT: మలయాళ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ఓ మలయాళ సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతాయన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఈ వారం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. అందులోను అది మలయాళ మూవీ.. పైగా మణిరత్నం నిర్మించిన సినిమా… మామూలుగానే మలయాళ సినిమాలకు , మణిరత్నం సినిమాలకు సెపరేట్ గా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. అలాంటిది… మణిరత్నం నిర్మించిన మలయాళ సినిమా అంటే… ఇంకా ఆ మూవీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి సైలెంట్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

మణిరత్నం నిర్మించిన ఈ మలయాళ సినిమా పేరు “పారడైజ్”. ఈ సినిమాకు ప్రసన్న వితానగే దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో ద‌ర్శ‌న‌రాజేంద్ర‌న్‌, రోష‌న్ మాథ్యూ హీరో హీరోయిన్లుగా నటించారు. జూన్ 22 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా.. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ కు ఎంపికై.. ఎన్నో అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇండో, శ్రీలంక కో ప్రొడక్షన్స్ లో నిర్మించారు. శ్రీలంక ప్రొడ్యూసర్స్ తో కలిసి దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ ఓటీటీ లలో కాకుండా.. మనోరమ మ్యాక్స్ తో పాటు.. సింప్లి సౌత్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయింది. మరి ఓటీటీ లో ఈ సినిమా ఎంతమందిని మెప్పిస్తుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ ఓటీటీ లకు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇక పారడైజ్ సినిమా కథ విషయానికొస్తే.. కేశవ్ , అమృత అనే భార్య భర్తలు తమ పెళ్లి రోజును జరుపుకోవడానికి శ్రీలంక టూర్ కు వెళ్తారు. కొద్దీ రోజులు వారి టూర్ అనుకున్న విధంగానే హ్యాపీగా సాగిపోతుంది. టూర్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు రిటర్న్ అవుదాం అనుకునే సమయానికి.. శ్రీలంకలో అంతర్యుద్ధం మొదలవుతుంది. అదేంటంటే ఆర్థిక సంక్షోభం కారణంగా.. అక్కడ ప్రజలతో పాటు.. వ్యతిరేక వర్గాలతో పాటు.. ప్రభుత్వంపైన తిరుగుబాటు చేస్తాయి. దీనితో ఆ భార్య భర్తలు ఇద్దరు శ్రీలంకలో చిక్కుకుపోతారు. వారు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటం చేశారు ? అక్కడినుంచి బయట పడ్డారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Show comments