iDreamPost
android-app
ios-app

అమరావతి ఆందోళన – విజయవాడలో ఉద్రిక్తం

అమరావతి ఆందోళన – విజయవాడలో ఉద్రిక్తం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మహిళలు చేసిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. అనుమతి లేకుండా విజయవాడ నగరంలోని పీడబ్యూడీ గ్రౌండ్‌ నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు బందరు రోడ్డులో మహిళలు పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అనుమతి లేకుండా పాదయాత్ర చేయరాదని, ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతుందని పోలీసులు వారించారు.

అయినా మహిళలు పాదయాత్ర చేసేందుకే యత్నించడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా స్టేషన్‌ వద్ద మహిళలు తమ నిరసనను కొనసాగించారు. పోలీసులు తమ పట్ట వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి