iDreamPost
android-app
ios-app

టిటిడి చరిత్రలోనే శ్రీవారికి అత్యధిక విరాళాలు ఇచ్చిన తమిళభక్తులు

  • Published Jun 06, 2022 | 4:30 PM Updated Updated Dec 15, 2023 | 3:34 PM

అప్పుడప్పుడు అజ్ఞాత భక్తులు బంగారం, నగదు రూపంలో భారీ విరాళాలు అందిస్తారు. కానీ.. టిటిడి చరిత్రలోనే సోమవారం అత్యధిక విరాళాలు అందాయట. ఈ విషయాన్ని టిటిడినే వెల్లడించింది. తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు..

అప్పుడప్పుడు అజ్ఞాత భక్తులు బంగారం, నగదు రూపంలో భారీ విరాళాలు అందిస్తారు. కానీ.. టిటిడి చరిత్రలోనే సోమవారం అత్యధిక విరాళాలు అందాయట. ఈ విషయాన్ని టిటిడినే వెల్లడించింది. తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు..

టిటిడి చరిత్రలోనే శ్రీవారికి అత్యధిక విరాళాలు ఇచ్చిన తమిళభక్తులు

తిరుమల ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రతినిత్యం భక్తుల నుంచి విరాళాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు అజ్ఞాత భక్తులు బంగారం, నగదు రూపంలో భారీ విరాళాలు అందిస్తారు. కానీ.. టిటిడి చరిత్రలోనే సోమవారం అత్యధిక విరాళాలు అందాయట. ఈ విషయాన్ని టిటిడినే వెల్లడించింది. తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు.. స్వామివారి పట్ల తమకున్న భక్తిని భూరి విరాళాల రూపంలో చాటాలు. నలుగురిలో ఒక భక్తుడు ఏకంగా రూ.7 కోట్లు విరాళం ఇచ్చారు. మిగతా ముగ్గురు రూ.కోటి చొప్పున విరాళాల చెక్కులను టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు.

తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ స్వామివారికి రూ. 7 కోట్ల విరాళం ఇచ్చారు. ప్రతినిత్యం జరిగే అన్నదానం సహా.. టిటిడి నిర్వహణలోని 7 ట్రస్టులకు ఒక్కో ట్రస్టుకు కోటి రూపాయల చొప్పున.. ఏడుకోట్ల విరాళం ఇచ్చారు. ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్సెక్ష‌న్ సంస్థ విద్యాట్రస్టుకు రూ. కోటి విరాళమివ్వగా.. శ్రీవాణి ట్ర‌స్టుకు బాల‌కృష్ణ ఫ్యూయ‌ల్ స్టేష‌న్ సంస్థ, ఎస్వీ వేద ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌కు సీ హ‌బ్ ఇన్సెక్ష‌న్ స‌ర్వీసెస్ సంస్థ రూ.1 కోటి చొప్పున విరాళాలు అందించాయి. మొత్తంమీద సోమవారం ఒక్కరోజే శ్రీవారికి రూ.10 కోట్ల భూరి విరాళాలు అందాయి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetMadridbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş