Idream media
Idream media
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె లో భాగంగా రేపు బుధవారం ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సకల జనుల సభకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. సరూర్ నగర్ లో సభ జరిపేందుకు ఆర్టీసీ జేఏసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అనుమతి నిరాకరించడంపై జేఏసీ హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మధ్యాహన్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
మరో వైపు ఆర్టీసీ సమ్మె పై మధ్యాహన్నం 2:30 గంటలకు హైకోర్టు లో విచారణ జరగనుంది. విచారణ లో ప్రభుత్వం తరపున వాదన ఎలా ఉండాలన్న దానిపై సీఎం కేసీఆర్.. అడ్వకేట్ జనరల్, ఆర్టీసీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు మంగళవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ తో కలసి సీఎం అధికారులతో సమేవేశం నిర్వహించారు.