iDreamPost
android-app
ios-app

జగన్‌కు కేటీఆర్‌ కితాబు

జగన్‌కు కేటీఆర్‌ కితాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కితాబిచ్చారు. సీఎం జగన్‌ పాలన మంచి ప్రారంభమని కొనియాడారు. ట్వీట్టర్‌లో నెటిజన్లు అడిగిన మేరకు కేటీఆర్‌ పై విధంగా స్పందించారు.

అదే విధంగా మూడు రాజధానులపై కూడా నెటిజన్‌ అడిగన ప్రశ్నకు స్పందించారు. మూడు రాజధానుల అంశం సరైనదో.. కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని వ్యాఖ్యానించారు.

కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌ ఎన్నికల మేనిఫెస్టో అమలుపై దృష్టి సారించారు. నవరత్నాలతోపాటు ఇచ్చిన హామీలు అమలే లక్ష్యంగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రైతు భరోసా, అగ్రిగోల్డ్, ఫింఛన్లు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగా, నూతన సంవత్సరంలో మరికొన్ని సంక్షేమ పథకాల అమలు చేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి