iDreamPost
android-app
ios-app

విశాఖలో వైఎస్సార్ సీపీలోకి జనసేన, బీజేపీల నుంచి భారీగా చేరికలు

విశాఖలో వైఎస్సార్ సీపీలోకి జనసేన, బీజేపీల నుంచి భారీగా చేరికలు

సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని టీటీడీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలోని జనసేన, బిజెపిల నుంచి వైఎస్సార్ సిపిలోకి చేరిన కార్యకర్తలను మద్దిలపాలెం, పార్టీ కార్యాలయంలో కండువాలు వేసి ఆహ్వానించారు.

ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చేలా పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ప్రతి ఇంటికి ఆసరా ఇచ్చేలా చేపడుతున్న సంక్షేమానికి తమ వంతుగా ప్రజలు 175 స్థానాల్లో విజయాలతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి