iDreamPost
android-app
ios-app

జగన్ ఆస్తుల కేసులో విచారణ ఫిబ్రవరి 6 కి వాయిదా

జగన్ ఆస్తుల కేసులో విచారణ ఫిబ్రవరి 6 కి వాయిదా

ఆస్తుల కేసుల్లో తనకి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం నాడు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కు హైకోర్టు వాయిదా వేసింది.

కాగా గత శుక్రవారం మినహాయింపును కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాలపై జగన్ హైకోర్టులో అప్పీలు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి