sai
sai
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావు ఈ రోజు హైదరాబాద్లో సమావేశం కానున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో వైఎస్ జగన్, కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఇప్పటికే ఇరువురు ముఖ్యమంత్రులు పలుమార్లు భేటీ ఐయ్యారు. తాజా సమావేశంలో గతంలో చర్చకు వచ్చిన గోదావరి కృష్ణ నదుల అనుసంధానం, కృష్ణ జలాల పంపకం తదితర ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.