తండ్రైన హీరో వరుణ్ ధావన్..మహాలక్ష్మి పుట్టిందంటూ వీడియో వైరల్

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, తన భార్య నటషా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇక ఈ విషయాన్ని వరుణ్ తండ్రి డైరెక్టర్ డేవిడ్ ధావన్ స్వయంగా ప్రకటించారు.

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, తన భార్య నటషా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇక ఈ విషయాన్ని వరుణ్ తండ్రి డైరెక్టర్ డేవిడ్ ధావన్ స్వయంగా ప్రకటించారు.

బిటౌన్ యంగ్ హీరో ‘వరుణ్ ధావన్’ గురించి అందరికి తెలిసిందే. కాగా, ఈయన బాలీవుడ్ స్టార్ హీరోల్లో  ఒకరు. అయితే ఈయన మొదటగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో ఇండస్ట్రీకి అడుగుపెట్టారు.ఇక ఈ సినిమా తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు వరుణ్ ధవన్. అయితే కెరీర్ మంచి ఫ్యామ్ లో ఉన్నప్పుడు ఈ హీరో తన చిన్ననాటి స్నేహితురాలు, డిజైనర్ నటాషా దలాల్ తో 2021 జనవరి 24న ఏడడుగులు వేశాడు. ఇక పెళ్లయిన మూడేళ్లుకు ఈ హీరో తండ్రి కాబోతున్నట్లు తన భార్య నటషా బేబి బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్‌ చేసి అభిమానులతో పంచుకున్న విషయం తెలిసింందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హీరో తండ్రిగా ప్రమోషన్ పొందారు. తాజాగా వరుణ్ ధవన్ సతీమణి నటాషా దలాల్ పండంటి ఆడబిడ్డను ప్రసవించింది.

కాగా, ఈ శుభవార్తను వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపాడు. ఇకపోతే ఈ వార్త తెలిసిన నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు వరుణ్, నటాషా దంపతులకు శుభకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా వరుణ్ ధావన్, డేవిడ్ ధావన్ ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ రిపోర్టర్లు వరుణ్ కి ఆడపిల్ల పుట్టింది నిజమేనా అని ప్రశ్నించారు. దీనికి డేవిడ్ స్పందిస్తూ.. ‘అవును మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది’ అని సమాధానం చెప్పారు. అలాగే శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే నటాషా గర్భవతి అయిన దగ్గర నుంచి వరుణ్ ధావన్ తన సినిమాలకు విరామం ఇచ్చి తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇకపోతే వరుణ్ ధవన్ తన తండ్రి డైరెక్టర్ డేవిడ్ ధావన్ వారసుడిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. కాగా, అతి తక్కువ కాలంలో తనకంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు  తెచ్చుకున్నాడు. ఇక వరుణ్ సినిమాల విషయానికొస్తే.. వరుణ్ ధావన్ నటిస్తున్న తాజా చిత్రం ‘బేబీ జాన్’. ఈ సినిమాను ఎ. కాళేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా.. మురాద్ ఖేతాని నిర్మతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రానికి అట్లీ, జ్యోతి దేశ్‌పాండే కథను అందించారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఇది కోలీవుడ్ హిట్ మూవీ తెరికి రీమేక్ అని సమాచారం. దీంతో పాటు అమెజాన్ వెబ్ సిరీస్ సిటాడెల్​లోనూ ఈ స్టార్ హీరీ కీలక పాత్ర పోషించాడు. అయితే వరుణ్ ధావన్, నటాషా దంపతులకు పండంటి ఆడబిడ్డను జన్మనివ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments