iDreamPost
android-app
ios-app

Keerthy Suresh : సినీపరిశ్రమని కుదిపేస్తున్న కరోనా.. కీర్తి సురేష్ కి పాజిటివ్!

  • Published Jan 11, 2022 | 12:08 PM Updated Updated Jan 11, 2022 | 12:08 PM
Keerthy Suresh : సినీపరిశ్రమని కుదిపేస్తున్న కరోనా.. కీర్తి సురేష్ కి పాజిటివ్!

భారతీయ చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి వణికిస్తోంది.. ఇప్పటికే చాలా మంది నటీనటులు, ఇతర కళాకారులు కరోనా భారిన పడగా., నేడు నటి కీర్తి సురేష్ కి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తనే స్వయంగా తన సోషల్ మీడియా లో వెల్లడించారు కీర్తి సురేష్.

తనకు గత కొన్ని రోజుల నుండి తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే నేడు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్ట్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ లో ఉన్నట్లు కీర్తి సురేష్ తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పకుండా వాక్సినేషన్ తీసుకొని, జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందకముందు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కీర్తి పోస్ట్ చేసారు.

ఇదిలా ఉంటే, ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సూపర్ స్టార్ మహేష్‌ బాబు, రాజేంద్ర ప్రసాద్, తమన్, రేణు దేశాయ్, త్రిష , ఖుష్బూ సుందర్, అరుణ్ విజయ్, మంచు మనోజ్ తదితర నటులు కరోనా భారిన పడ్డారు.

Also Read : Latha Mangeshkar : లెజెండరీ సింగర్ “లతా మంగేష్కర్” కి కోవిడ్ పాజిటివ్.. ICU లో చికిత్స!