iDreamPost
android-app
ios-app

విషాదం! Hydra భయంతో ఆత్మ హత్య చేసుకున్న మహిళ!

  • Published Sep 27, 2024 | 10:15 PM Updated Updated Sep 28, 2024 | 9:51 AM

Hydra: హైడ్రా దెబ్బకు హైదరాబాద్ వాసులు వణికిపోతున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇళ్లు నిర్మించుకున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

Hydra: హైడ్రా దెబ్బకు హైదరాబాద్ వాసులు వణికిపోతున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇళ్లు నిర్మించుకున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

  • Published Sep 27, 2024 | 10:15 PMUpdated Sep 28, 2024 | 9:51 AM
విషాదం! Hydra భయంతో ఆత్మ హత్య చేసుకున్న మహిళ!

నగరవాసులను ‘హైడ్రా’ హడల్ ఎత్తిస్తోంది. సామాన్యులకు వణుకు పుట్టిస్తుంది. ఎన్నో ఇళ్లను కూల్చేస్తుంది. తాజాగా హైడ్రా దెబ్బకు ఓ ప్రాణం బలైంది. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా దెబ్బకు ఓ మహిళ తట్టుకోలేకపోయింది. ఆ భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఇది నిజంగా బాధాకరమైన విషయం. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి రామాలయం దగ్గరలోని యాదవబస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ, శివయ్య యాదవ్‌ దంపతులు ఉంటున్నారు. అయితే కూకట్‌పల్లి నల్లచెరువు పరిధిలోని 16 కట్టడాలను హైడ్రా అధికారులు ఈ నెల 22న కూల్చివేయగా.. వాటి ఎదురుగా వీళ్ళ రెండు ఇళ్లు, ఓ షెడ్డు ఉన్నాయి. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తమ ఇళ్లను ఆ ముగ్గురి పెళ్లిళ్లకు కట్నంగా రాసిచ్చారు.

కానీ హైడ్రా కూల్చివేతలు బచ్చమ్మను దారుణమైన పరిస్థితికి దారి తీశాయి. ఈ కూల్చి వేతల్లో భాగంగా ఇండ్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు ఇటీవలే అందరినీ హెచ్చరించారు. ప్రజలపై ఒత్తిడి పెంచారు. అధికారులు నల్లచెరువులోని కట్టడాలను కూల్చివేసినప్పటి నుంచి బుచ్చమ్మ దిగులుగా ఉండేవారట. తమ కుమార్తెలకు రాసిచ్చిన ఇళ్లు, షెడ్డును కూడా కూలుస్తారేమోనని అందరితో చెబుతూ కంగారు పడుతుండేదట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది బుచ్చమ్మ. ఏం చెయ్యాలో అర్ధం కానీ స్థితిలో నరకయాత పడింది. దీనికి పరిష్కారం లేదని తెలుసుకుంది. చివరకి చావునే మార్గంగా ఎంచుకుంది. దాంతో శుక్రవారం నాడు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. బుచ్చమ్మ కుమార్తెలు, బంధువులు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విలవిల లాడిపోయారు. శోకసంద్రంలో మునిగిపోయారు.

హైడ్రా అధికారుల వేధింపులే బుచ్చమ్మ మరణానికి కారణమని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమెకు కుమారులు లేరు. ఉన్నది ముగ్గురు కుమార్తెలు మాత్రమే. వారి భవిష్యత్తు బాగుండాలని చాలా కష్ట పడింది. భర్త శివయ్యతో పాటు బుచ్చమ్మ కూడా కష్టపడి పని చేసి ఒక్కో రూపాయి కూడబెట్టారు. ఈ ఇళ్లను కొన్నారు. తన బిడ్డల పెళ్లిళ్లకు కట్నం కింద వీటిని రాసిచ్చారు. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తాం అనేసరికి ఆవేదనకు గురై ఇలా ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ దారుణమైన సంఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio