iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో 50 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

  • Published Aug 20, 2024 | 9:57 PM Updated Updated Aug 20, 2024 | 9:57 PM

ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతల్లో బాంబు బెదిరింపు కాల్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి దేశంలో ప్రభుత్వ, ప్రవైట్‌ ఆసుపత్రులతో పాటు ఓ మాల్‌ కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఎక్కడంటే

ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతల్లో బాంబు బెదిరింపు కాల్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి దేశంలో ప్రభుత్వ, ప్రవైట్‌ ఆసుపత్రులతో పాటు ఓ మాల్‌ కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఎక్కడంటే

  • Published Aug 20, 2024 | 9:57 PMUpdated Aug 20, 2024 | 9:57 PM
ఢిల్లీలో 50 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బాంబుల బెదిరింపులు అనేవి తరుచుగా వస్తునే ఉంటాయి.  ఇక ఈ బాంబు బెదిరింపులు రావడంతో..  పోలీసులు కంగారు పడతూ బెదిరింపు వచ్చిన ప్రదేశాల్లో అణువణువూ జల్లెడ పట్టి మరీ బాంబు కోసం తనీఖీలు చేస్తుంటారు. కానీ, ఇలా వచ్చిన బెదిరింపుల్లో చాలా వరకు కొంతమంది ఆకాతాయిలు చేసే అల్లరి పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి కొన్నిసార్లు నిజంగానే  ఈ బాంబు బెదిరింపులు ఫోన్లు , మెయిల్స్ వస్తుంటాయి. కాగా, వాటిలో ఎక్కువగా.. పబ్లిక్‌ తిరిగే ప్రదేశాల్లో అనగా.. షాపింగ్ మాల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి చోట్ల  బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, మెయిల్స్ వస్తుంటాయి. దీంతో హుటహుటిన పోలీసులు,బాంబ్ స్కాడ్ సిబ్బంది అలెర్ట్ అవుతుంటాయి. ఇప్పటికే ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలా సార్లు రాగా.. తాజాగా నేడు ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రవైట్‌ ఆసుపత్రులతో పాటు ఓ మాల్‌ కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ తదితర 50 ప్రభుత్వ ,ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు ఒక మాల్‌కు మంగళవారం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బాంబు బెదిరింపు చర్యలు అనేవి నన్‌గ్లోయిలోని ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.04 గంటలకు , చాణక్యపురి లోని ప్రైమస్ ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.07 గంటల సమయంలో వచ్చయనే   సమాచారం తమకు అందిందని ఢిల్లీ ఫైర్‌సర్వీస్ అధికారి చెప్పారు. ఇక మిగతా ఆస్పత్రుల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు.  ఇకపోతే బాంబు బెదిరింపు కాల్స్ అందుకున్న వాటిలో అపోలో, మూల్‌చంద్, మాక్స్ అండ్ సర్‌గంగారామ్ ఆస్పత్రులు కూడా ఉన్నాయని వారు వెల్లడించారు.

అయితే ఈ బాంబే బెదిరింపు చర్యలు అనేవి నేడు అనగా మంగళవారం (ఆగస్టు 20వ తేదీ) మధ్యాహ‍్నం 12.04 గంటలకు జిమెయిల్‌ రూపంలో వచ్చాయి. కాగా, అందులో..  గుర్తు తెలియని వ‍్యక్తులు మీ భవనం లోపల అనేక పేలుడు పదార్థాలను అమర్చాం.  అవి నల్లటి కవర్లలో ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో అవి పేలబోతున్నాయి. మీ భవనంలో ఉన్నవారందరూ రక్తపు మడుగులో అంతం కానున్నారు. మీలో ఏ ఒక్కరూ మిగలరు. మానవాళికి స్కామ్ తప్ప నాకు మరేమీ లేదు. ఈరోజు భూమిపై మీ ఆఖరి రోజు అని హెచ్చరించి ఉంది. ఇకపోతే ఈ మెయిల్‌ లో సిఒయుఆర్‌టి పేరు గల గ్రూపుతో ఉంది. అంతేకాకుండా.. ఉగ్రవాదాన్ని తాము ఆపలేం. న్యూస్ అవుట్‌లెట్స్‌కు గ్రూప్ పేరు ఇవ్వండి అని ఉంది. అయితే ఈ బెదిరింపు ఈ మెయిళ్లు ఇదివరకు ఆస్పత్రులకు, స్కూళ్లకు, యూనివర్శిటీలకు, ప్రభుత్వ భవనాలకు పంపిన మాదిరి గానే ఉన్నాయని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler