Keerthi
సాధారణంగా పిల్లలకు ఏ ఇబ్బందులు ఎదురయిన, ఏ చిన్న బాధ కలిగిన ముందుగా అమ్మే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే.. అమ్మా తన ప్రాణాలను పనంగా పెట్టి మరి పిల్లలను రక్షించుకుంటుంది. మరి, అలాంటి తల్లి వల్లే పిల్లలకు బాధకు గురైతే.. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేనిది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తన పిల్లలను విచక్షరహితంగా కొట్టడమే కాకుండా.. ఆ ఘటనను వీడియో తీయమని తన భర్తకు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సాధారణంగా పిల్లలకు ఏ ఇబ్బందులు ఎదురయిన, ఏ చిన్న బాధ కలిగిన ముందుగా అమ్మే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే.. అమ్మా తన ప్రాణాలను పనంగా పెట్టి మరి పిల్లలను రక్షించుకుంటుంది. మరి, అలాంటి తల్లి వల్లే పిల్లలకు బాధకు గురైతే.. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేనిది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తన పిల్లలను విచక్షరహితంగా కొట్టడమే కాకుండా.. ఆ ఘటనను వీడియో తీయమని తన భర్తకు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Keerthi
ఈ సృష్టిలో అన్నిటికన్నా విలువైనది గొప్పది ఏదంటే.. అది అమ్మ ప్రేమనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ అమ్మ ప్రేమలో ఒక అనురాగం, అనుబంధం, అత్మియత, త్యాగం.. ఇలా ఎన్ని మాటాలు చెప్పుకున్న అమ్మ ప్రేమ అనేది వర్ణించరానిది విలువ కట్టలేనిది. ఎందుకంటే.. అమ్మ తన కడుపులో నవ మాసాలు మోసి ఎన్నో సమస్యలు ఎదుర్కొని, తాను పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. అందుకే అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ, ప్రస్తుత కాలంలో అమ్మా తనానికే మచ్చ తెస్తూ కొంతమంది తల్లిలు కసాయిగా ప్రవర్తిస్తున్నారు.
సాధారణంగా పిల్లలకు ఏ ఇబ్బందులు ఎదురయిన, ఏ చిన్న బాధ కలిగిన ముందుగా అమ్మే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే.. అమ్మా తన ప్రాణాలను పనంగా పెట్టి మరి పిల్లలను రక్షించుకుంటుంది. మరి, అలాంటి తల్లి వల్లే పిల్లలకు బాధకు గురైతే.. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేనిది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తన పిల్లలను విచక్షరహితంగా కొట్టడమే కాకుండా.. ఆ ఘటనను వీడియో తీయమని తన భర్తకు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తాజాగా మహారాష్ట్రలోని ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి కనీసం తన ఇద్దరి బిడ్డల మీద కనికరం లేకుండా.. ఇష్టానుసారంగా దాడి చేసింది. కాస్త కూడా కన్న ప్రేమ గుర్తుకు రాకుండా.. బెల్టుతో కొడుకు, కూతురిని చితకబాదింది. ఇక ఆ పిల్లలు అమ్మ కొడుతున్న దెబ్బలతో అల్లాడిపోతుంటే, ఈ సంఘటనను పిల్లల తండ్రి ఆపకుండా తన ఫోన్లో వీడియోను తీయడం గమన్హారం. అయితే దారుణమైన ఘటన ముంబైలోని వాన్రాయ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఓ మహిళ తన కూతురు, కొడుకును దారుణంగా చెంపదెబ్బలతో, బెల్టుతో చితకబాదింది. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, పిల్లలు గుక్కపట్టి ఏడుస్తూ, కొట్టవద్దని తల్లిని వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే ఆ వీడియోలో తాను కొడుతున్నట్లు రికార్డ్ చేయమని తన భర్తను ఆమె కోరడం స్పష్టంగా వినిపిస్తోంది. అయితే చాలా రోజుల నుంచి వివాహిత తన పిల్లలపై ఈ విధంగానే ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈవీడియో వైరల్ అవ్వడంతో రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎస్జె కథవాలా ఈ వ్యవహారంపై బాలల రక్షణ హక్కుల కమిషన్కు లేఖ రాశారు. అలాగే వెంటనే ఆ తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ముంబై పోలీసు కమిషనర్కు కూడా లేఖ రాశారు. ఇక వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక కాపీని పంపినట్లు రిటైర్డ్ జడ్జి కథవాలా తెలిపారు. మరోవైపు భార్యాభర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్కు పిలిపించి, తల్లిదండ్రులు, పిల్లల స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వీడియో 2022 సంవత్సరానికి చెందినదని, ఇప్పుడు బయటపడిందని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు పిల్లలిద్దరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించారు. మరి, పిల్లలపై అంతా విచాక్షరహితంగా ఆ తల్లి కొడుతున్న ఈ దృశ్యం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | #Mumbai: Videos Show Woman Hitting Her Children With Belt; Ex-HC Judge Shahrukh Kathawala Urges Police, Rights Groups To Take Action#MumbaiNews #IndiaNews pic.twitter.com/6OP1JDiLVY
— Free Press Journal (@fpjindia) July 2, 2024