iDreamPost
android-app
ios-app

నీట మునిగిన బెంగుళూరు.. విద్యాసంస్థలకు సెలవులు!

  • Published Oct 16, 2024 | 1:32 PM Updated Updated Oct 16, 2024 | 4:59 PM

Bengaluru Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి తీరం వైపు తరుముకొస్తుంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుదుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల బెంగుళూరులో వర్షాలు దంచికొడుతున్నాయి.

Bengaluru Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి తీరం వైపు తరుముకొస్తుంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుదుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల బెంగుళూరులో వర్షాలు దంచికొడుతున్నాయి.

నీట మునిగిన బెంగుళూరు.. విద్యాసంస్థలకు సెలవులు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇప్పుడు ఆ వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుదుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాయుగుండం ప్రభావం వల్ల బెంగళూరులో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తమిళనాడు, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా బెంగళూరులో జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రైళ్లు, ఫ్లైట్ సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. బలమైన ఈదరు గాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. భారీ వృక్షాలు కూలడంతో.. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు, కరెంట్ లేకపోవడంతో బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో అతిపెద్ద ఐటీ హబ్ అయిన మాన్యత టెక్ పార్క్ నీట మునిగింది. బెంగళూరు వర్షాలకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఇటీవల బెంగుళూరులో వాతావరణ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. మొన్నీ మధ్య చుక్క నీళ్లు బెంగళూరు వాసులు అల్లాడిపోయారు. తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొన్నారు. నీళ్ల కోసం షాపింగ్ కాంప్లెక్సులను కూడా వదల్లేదు. అలాంటి నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలతో బెంగళూరు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత రెండ్రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వరద నీరు ఏరులై పారుతోంది. నాగావర ఫ్లై ఓవర్ వర్షం కారణంగా పూర్తిగా జలమయం అయ్యింది. మాన్యతా టెక్ పార్క్ ‌లోని చాలా కంపెనీలు నీటితో నిండిపోయాయి. RGA టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్.. సర్జాపూర్ రోడ్డులోని విప్రో గేట్.. ITPLలోని హుడీ.. ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా వరద ముంపులో ఉన్నాయి. వర్షం ప్రభావం తగ్గే వరకు కంపెనీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఉద్యోగుల సేఫ్టీ కోసం పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంం‌కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాగే విద్యాసంస్థలకు డిప్యూటీ కమిషనర్ సెలవులు ప్రకటివంచారు. కాకపోతే కాలేజీలు తెరిచి ఉంటాయని తెలిపారు.

భారీ వర్షం కారణంగా బుధవారం ఉదయానికే చౌడేశ్వరిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడ 89.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. HAL ఎయిర్ పోర్ట్ వద్ద 88 మిల్లీ మీటర్లు, విద్యారణ్యపుర వద్ద 80.5, జక్కూరులో 75.5, రాజమహల్ గుట్టహళ్లిలో 68.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. హురమావులో 67.5, దొడ్డనెక్కుండిలో 67, పులకేశనగర్ లో 62.5 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమెదైనట్లు అదికారులు తెలిపారు. బెంగుళూరులోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెంగుళూరు అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనులు అయితేనే బయటకు రావాలని తెలిపారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్న పిల్లలు వర్షాలకు బయటకు రాకుండా ఉంటే మంచిదని భారత వాతావరణ శాఖ సూచించింది.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking