iDreamPost

మన డాక్టర్స్ అద్భుతం చేశారు.. లేజర్ ట్రీట్మెంట్ తో వరల్డ్ రికార్డు!

  • Published Jul 05, 2024 | 7:18 PMUpdated Jul 05, 2024 | 7:18 PM

ఇప్పటి వరకు వైద్య రంగంలో ఎన్నడు చూడని అద్భుతాలను వినే ఉంటం. కానీ, మొదటిసారి వైద్య రంగంలో సాధ్యం కానీ ఓ గొప్ప విజయాన్ని భారత వైద్యులు సాధించి చూపించారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్స్ ను లేజర్ ట్రీట్‌మెంట్‌తో తొలగించారు. ఇంతకి ఎక్కడంటే..

ఇప్పటి వరకు వైద్య రంగంలో ఎన్నడు చూడని అద్భుతాలను వినే ఉంటం. కానీ, మొదటిసారి వైద్య రంగంలో సాధ్యం కానీ ఓ గొప్ప విజయాన్ని భారత వైద్యులు సాధించి చూపించారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్స్ ను లేజర్ ట్రీట్‌మెంట్‌తో తొలగించారు. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jul 05, 2024 | 7:18 PMUpdated Jul 05, 2024 | 7:18 PM
మన డాక్టర్స్ అద్భుతం చేశారు.. లేజర్ ట్రీట్మెంట్ తో వరల్డ్ రికార్డు!

ప్రస్తుతం దేశంలోని టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.ఈ క్రమంలోనే నేటి కాలంలో.. వివిధ రంగాల్లో ఎన్నో విప్లవాత్మక విజయాలను అనగా అసాధ్యమైన పనులను కూడా సాధ్యపడేలా చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య రంగం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ రంగంలో ఇప్పటి వరకు ఎన్నడు , విని, ఎరగని అద్భుతాలను చాలామంది వైద్యులు చేసి సంచలనం సృష్టిస్తున్నారు. అందుకే ఆపదలో ఉన్న సమయంలో కనిపించని దేవుడు కన్నా..కనిపించిన వైద్యుడునే దేవుడిలా భావిస్తారు. అయితే ఇప్పటి వరకు కుడి పక్కన ఉండు గుండెను ఎడమ పక్కన అమార్చడం, 13 నెలల చిన్నారి కిడ్నీలను 30 ఏళ్ల యువకుడికి అమర్చడం వంటి ఎన్నో అద్భుతాలు వినే ఉంటాం. కానీ, మొట్ట మొదటిసారి వైద్య రంగంలో సాధ్యం కానీ ఓ గొప్ప విజయాన్ని భారత వైద్యులు సాధించి చూపించారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్స్ ను లేజర్ ట్రీట్‌మెంట్‌తో తొలగించారు. ఇంతకి ఎక్కడంటే..

ఇప్పటి వరకు వైద్య రంగంలో  ఎన్నడు వినని, చూడని అద్భుతాలను సృష్టించి విజయం సాధించిన వైద్యులను చూసి ఉంటాం. కానీ, మొట్ట మొదటిసారి దేశంలోనే కాదు, అసలు ప్రపంచంలోనే సాధ్యం కానీ ఓ ఆపరేషన్ చేసి విజయం సాధించారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్స్ ను లేజర్ ట్రీట్‌మెంట్‌తో తొలగించారు.  అది కూడా 60 ఏళ్ల వృద్ధునికి చేయడం గమన్హారం. కాగా, ప్రస్తుతం ఆయన చేసిన పని వైద్య రంగంలో సంచలనంగా మారింది. మరి ఆ వివరాళ్లోకి వెళ్తే.. రాయ్‌పూర్‌లోని భీమ్ రావ్ అంబేడ్కర్ ప్రభుత్వం హాస్పిటల్ లోని మన ఇండియాన్  HOD డాక్టర్ స్మిత్ శ్రీవాస్తవ నేతృత్వంలోని..  గొప్ప విజయాన్ని సాధించారు. ముఖ్యంగా  ప్రపంచంలోనే ఫస్ట్ టైం రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్స్ ను కేవలం  లేజర్ ట్రీట్‌మెంట్‌తో తొలగించారు.  అసలు ఇంతవరకు ట్రీట్‌మెంట్‌తో ఎన్నడు నిర్వహించని ఈ రిస్క్ ఆఫరేషన్ సక్సెస్ ఫుల్ గా ఓ 66 ఏళ్ల వృద్ధ వ్యక్తి చేసి చూపించారు.

అయితే ఆ 66ఏళ్ల రోగి ఎడమ మూత్రపిండ ధమనిలో 100, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో 90 శాతం బ్లాక్స్ ను కేవలం లేజర్ చికిత్స ద్వారా సర్జరీ చేసి తొలగించారు. కాగా, ఈ అద్భుతమైన ఘటన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఆసుపత్రి అయిన రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో డాక్టర్లు, అడ్వాన్స్ కార్డియాక్ ఇన్‌స్టిట్యూట్‌లోని డాక్టర్లతో కలిసి ఈ ఆపరేషన్ ను పూర్తి చేశారు. ఇకపోతే ఆ రోగికి 2023లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టెంట్‌ చేయించారు. కానీ, అది పూర్తిగా మూసుకుపోయింది. దీనివల్ల తీవ్రమైన గుండె సమస్యలు, రక్తపోటు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పేషెంట్ ఎదుర్కొన్నారని స్మిత్ శ్రీవాస్తవ తెలిపారు. దీంతో లేజర్ యాంజియోప్లాస్టీ ద్వారా మూత్రపిండాల ధమనుల్లో ఏర్పడే బ్లాక్స్ కు దీర్ఘకాలికంగా పరిష్కరం చేశామని, ప్రపంచంలోనే ఇలా చేయడం ఫస్ట్ టైం అని డాక్టర్లు పేర్కొన్నారు. మరి, మొదటిసారి ఛత్తీస్‌గఢ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇండియాన్ డాక్టర్లు రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్స్ ను లేజర్ ట్రీట్‌మెంట్‌తో తొలగించిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి