iDreamPost
android-app
ios-app

మహేశ్- రాజమౌళి మూవీలో వరదరాజ మన్నార్! ఇదేమి ట్విస్ట్?

  • Published May 20, 2024 | 3:19 PMUpdated May 20, 2024 | 3:19 PM

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, దర్శకుడు  ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌ లో SSMB29 సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా ప్రకటించన నుంచి ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఋ సినిమా నుంచి మరో ఆప్‌ డేట్‌ అనేది వైరల్‌ గా మారింది.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, దర్శకుడు  ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌ లో SSMB29 సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా ప్రకటించన నుంచి ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఋ సినిమా నుంచి మరో ఆప్‌ డేట్‌ అనేది వైరల్‌ గా మారింది.

  • Published May 20, 2024 | 3:19 PMUpdated May 20, 2024 | 3:19 PM
మహేశ్- రాజమౌళి మూవీలో వరదరాజ మన్నార్! ఇదేమి ట్విస్ట్?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, దర్శకుడు  ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌ లో SSMB29  సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కాంబినేషన్ మూవీ తెరకెక్కనుందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై అభిమానుల్లో భారీగా ఆసక్తి మొదలైంది. ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని ఈ సినిమా పై రోజుకోక వార్త నెట్టింట వైరల్‌ అవుతూ ఉంది. ఇక సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి రూమర్స్‌ ఏదో ఒకటి వినిపిస్తునే ఉన్నాయి.  అయితే ఇటీవలే ఒకరు ఫేక్ క్యాస్టింగ్ కాల్ ని పోస్ట్ చేస్తే అది వైరల్‌ అవ్వగా.. దానిని చూసిన నిర్మాణ సంస్థ అది తప్పని ప్రెస్‌ నోట్‌ విడుదల చేసిన   విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే  మహేష్ సినిమాకు సంబంధించి జక్కన్న తన బృందం ఎన్ని  జాగ్రత్తలు తీసుకుంటున్న  ఏదో ఒక  సమాచారం బయటికి  వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే విదేశీ అమ్మాయిల హీరోయిన్ ని తీసుకుంటున్న సంగతి కూడా దుర్గా ఆర్ట్స్ చెప్పింది కాదు. కానీ,  ఇప్పుడు ఇంకో అప్డేట్ అనేది సోషల్‌ మీడియాలో   హాట్ టాపిక్ నిలిచింది. ఇంతకి అదేమింటంటే.. మహేష్‌ తో చేస్తున్న సినిమాలో రాజమౌళి  ఓ కీలకమైన ప్రతినాయక పాత్ర కోసం  మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ని అనుకుంటున్నట్టు సమాచారం తెలిసింది.

కాగా, సలార్‌ లో వరదరాజ మన్నార్ గా తన ప్రెజెన్స్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. నటుడిగా అసలు పేరు కంటే క్యారెక్టర్ గానే గుర్తుండిపోయాడు. ‍కనుక ఒకవేళ  నిజంగా.. రాజమౌళి ఈ సినిమా కోసం పృథ్విరాజ్ అడిగి ఉంటే మాత్రం.. డేట్లు ఇవ్వకుండా ఉంటాడా..? కానీ, అధికారికంగా ఈ విషయం చెప్పేదాకా ఏది నిజమో ఏది కాదో   తెలియని పరిస్థితి అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇక స్క్రిప్ట్ ని దాదాపుగా లాక్ చేసిన రాజమౌళి ఈ నెల 31 కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఎస్ఎస్ఎంబి 20ని అఫీషియల్ గా లాంచ్ చేయచ్చని సమాచారం. కాగా, ఈ ముహూర్తం కోసమే అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే  మహేష్ సినిమా కోసం ప్రత్యేకంగా మార్చుకున్న హెయిర్ స్టైల్ ట్రెండ్‌ అయిన విషయం తెలిసిందే. ఇక   ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. అయితే అందులో  మహేష్ లుక్ ఫైనల్ అయ్యాక ఇక బయటికి రావడం ఉండదని అంటున్నారు. మరి, మహేష్‌ సినిమాలో పృథ్విరాజ్ నటించనున్నరనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి