iDreamPost
android-app
ios-app

Rishab Shetty: ఈ అవార్డు వారికే అంకితం.. రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్!

  • Published Aug 17, 2024 | 11:14 AM Updated Updated Aug 17, 2024 | 11:14 AM

70th National Film Awards, Rishab Shetty: నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత రిషబ్ శెట్టి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ అవార్డును వారికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ ఈ పురస్కారాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే?

70th National Film Awards, Rishab Shetty: నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత రిషబ్ శెట్టి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ అవార్డును వారికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ ఈ పురస్కారాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే?

Rishab Shetty: ఈ అవార్డు వారికే అంకితం.. రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా 70వ భారతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ అవార్డుల్లో ‘కాంతార’ మూవీలో అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. చిన్న చిత్రంగా విడుదలైన కాంతార ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఇక ఈ పురస్కారం దక్కిన తర్వాత ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు ఈ స్టార్ హీరో. ఈ అవార్డును వారికి అంకితం ఇస్తున్నట్లు ఆ పోస్ట్ లో తెలిపాడు.

70వ జాతీయ చలనచిత్ర అవార్డులను తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి నిలిచాడు. కాంతార మూవీలో నటనకు గాను అతడికి ఈ పురస్కారం దక్కింది. కాగా.. ఈ అవార్డు గెలిచిన తర్వాత ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు రిషబ్ శెట్టి. అందులో ఈ అవార్డును వారికి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

rishab shetty emotional tweet

“నేషనల్ అవార్డు గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. నా ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ కు ధన్యవాదలు. ముఖ్యంగా హోంబలే ఫిల్మ్స్ కు. ప్రేక్షకులు ఎంతగానో ఈ చిత్రానికి సపోర్ట్ చేశారు. ఆడియెన్స్ కోసం ఎంత కష్టమైనా పడి, ఒక గొప్ప సినిమా తీసుకురావాలన్నదే నా తాపత్రయం అంతా. అందుకోసం ఎంత కష్టమైనా భరిస్తాను. ఇక ఈ అవార్డును కన్నడ ప్రేక్షకులకు, రాష్ట్రంలోని దేవ నర్తకులకు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ కు అంకితం ఇస్తున్నాను” అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగులో కార్తికేయ 2 సినిమాకు అవార్డు దక్కింది. నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.