Chiranjeevi Guest For Nandamuri Balakrishna Event: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాలకు చిరంజీవి? పూనకాలకు సిద్ధమా?

నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాలకు చిరంజీవి? పూనకాలకు సిద్ధమా?

Chiranjeevi To Attend Nandamuri Balakrishna 50 Years Celebrations: మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దర్నీ ఒకే వేదిక మీద చూస్తే అభిమానులకు డబుల్ బొనాంజా అనే చెప్పాలి. ఇద్దరు బడా స్టార్లను ఒకే దగ్గర చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

Chiranjeevi To Attend Nandamuri Balakrishna 50 Years Celebrations: మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దర్నీ ఒకే వేదిక మీద చూస్తే అభిమానులకు డబుల్ బొనాంజా అనే చెప్పాలి. ఇద్దరు బడా స్టార్లను ఒకే దగ్గర చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ.. దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలు. తెలుగు సినీ వినీలాకాశంలో ఈ స్టార్లకు ఉన్న క్రేజ్, పాపులారిటీ అంతా ఇంతా కాదు. వాళ్ల సినిమాలు వస్తున్నాయంటేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. కలెక్షన్ల తుఫాను సృష్టించడం వాళ్లకో సరదా. అంతలా తెలుగు సినిమాను ఏలిన ఈ ఇద్దరు టాప్ హీరోస్ ఇప్పుడు కూడా అదే జోరును కంటిన్యూ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్​ చేస్తూ కుర్ర హీరోలతో పోటీపడుతున్నారు. సూపర్ ఎనర్జీ లెవల్స్​తో ఇతర స్టార్లకు సవాల్ విసురుతున్నారు. అయితే వీళ్లిద్దర్నీ కలిపి ఒకే సినిమాలో చూడాలనేది కోట్లాది అభిమానుల కల. అది ఇప్పటిదాకా నెరవేరలేదు. కానీ త్వరలో వీళ్లిద్దరూ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. బాలయ్య స్వర్ణోత్సవ వేడుకులకు మెగాస్టార్ రానున్నారని తెలుస్తోంది.

సెప్టెంబర్ 1వ తేదీన బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబురాలు జరగున్నాయి. ఇప్పటికే కర్టన్​రైజర్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నటుడిగా బాలయ్య 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడులను నిర్వహించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. ఈ సెలబ్రేషన్స్​కు చీఫ్​ గెస్ట్​గా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని ఫిల్మ్ నగర్ టాక్. వేడుకులకు ముఖ్య అతిథిగా రావాలని చిరును ఆహ్వానించారట. అందుకు ఆయన ఓకే చెప్పారని సమాచారం. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. కానీ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్ అటెండ్ అవుతారనే వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి-బాలకృష్ణ ఒకే వేదిక మీద కనిపించడం ఖాయమని గాసిప్ప్ వస్తున్నాయి. ఇక అభిమానులకే పూనకాలేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. బాలయ్య కోసం మెగాస్టార్ వస్తే స్టేజ్ షేక్ అవ్వడం పక్కా చెబుతున్నారు. బాలకృష్ణ కోసం చిరు తరలి రానుండటం మంచి విషయమని.. ఇది కదా స్నేహమంటే అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూమెంట్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నామని.. ఇప్పుడు నిజం కాబోతోందని అంటున్నారు. అయితే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడులకు చిరంజీవి రాకపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ చెప్పలేం. కాగా, బాలయ్య హోస్ట్​గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్​స్టాపబుల్’కు కూడా చిరు రానున్నారని జోరుగా వినిపిస్తోంది. దీనిపై మెగాస్టార్ బర్త్ డే నాడు అనౌన్స్​మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అన్నీ కుదిరితే షార్ట్ గ్యాప్​లో చిరు-బాలయ్య రెండు వేర్వేరు వేదికల మీద కలసి సందడి చేసే అవకాశం ఉందని సమాచారం. మరి.. చిరంజీవి-బాలయ్యను ఒకే వేదిక మీద చూసేందుకు మీరెంత ఉత్సాహంగా ఉన్నారో కామెంట్ చేయండి.

Show comments