ఆ ఒక్క పోస్టుతో పుకార్లకు పులుస్టాప్‌ పెట్టిన మహాలక్ష్మి!

తమిళ సీరియల్‌ నటి మహాలక్ష్మి, నిర్మాత రవీందర్‌ల ప్రేమ, పెళ్లి స్టోరీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2022లో పెళ్లయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట తరచుగా వార్తలో నిలుస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితం రవీందర్‌ చీటింగ్‌ కేసులో జైలు పాలయ్యారు. ఓ ల్యాండ్‌ విషయంలో రవీందర్‌ నన్ను మోసం చేశాడంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రవీందర్‌ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన జైలులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి.. రవీందర్‌పై కోపంగా ఉందని, అతడు తనను దారుణంగా మోసం చేశాడంటూ సంచలన కామెంట్లు చేసిందన్న పుకార్లు కూడా వచ్చాయి. ఈ పుకార్లకు మహాలక్ష్మి ఒక్క పోస్టుతో పులుస్టాప్‌ పెట్టారు. తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ ‘‘ నా పెదాలపై చిరునవ్వు తెప్పించే విషయంలో నువ్వు ఎప్పుడూ విఫలం కాలేదు. ప్రేమకు ప్రధానం ఎప్పటికైనా నమ్మకమే.. ఇక్కడ నాకంటే నమ్మకమే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తోంది.

ఎ‍ప్పటిలాగే ప్రేమను చూపించు. ముందుకంటే ఎక్కువగా ప్రొటెక్ట్‌ చేయ్‌’’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టుతో తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మహాలక్ష్మి చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి, భర్తతో ఉన్న ఫొటో పెట్టి.. మహాలక్ష్మి పుకార్లకు అడ్డుకట్ట వేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments