iDreamPost
android-app
ios-app

Ration Scam: రేషన్ కుంభకోణంలో సినీ నటికి ED సమన్లు!

ఇటీవల కాలంలో పలువురు సినీ రంగానికి చెందిన వారు వివిధ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఓ సినీ నటి రేషన్ కుంభకోణంలో ఆరోణలు ఎదుర్కొంటుంది. ఆమెకు తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది.

ఇటీవల కాలంలో పలువురు సినీ రంగానికి చెందిన వారు వివిధ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఓ సినీ నటి రేషన్ కుంభకోణంలో ఆరోణలు ఎదుర్కొంటుంది. ఆమెకు తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది.

Ration Scam: రేషన్ కుంభకోణంలో సినీ నటికి ED సమన్లు!

సినీ, రాజకీయ రంగాలకు  సంబంధించి ఏదో ఒక వార్త వస్తోంది. వారి వ్యక్తిగత, కుటుంబ  విషయాలతో పాటు పలు ఇతర అంశాల్లో వారు వార్తల్లో నిస్తుంటారు. మరికొందరు సెలబ్రిటీలు అయితే పలు స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొగా,  మరికొందరు మొత్తం నేరుగా దొరికిపోతున్నారు. ఈ క్రమంలో పలు స్కామ్ లో కొందరు సెలబ్రిటీలు నోటీసులు అందుకుని విచారణకు హాజరవుతుంటారు. తాజాగా ఓ సినీ నటికి కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మరి.. ఆ నటి ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవల కాలంలో పలువురు సినీ రంగానికి చెందిన వారు వివిధ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే  బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీ విషయంలో సినీ నటి హేమ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆమె తో పాటు మరికొందరు సినీరంగానికి చెందిన వారు  రేవ్ పార్టీలో పాల్గొన్నాట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికీ నోటీసులు జారీ చేసి..విచారణకు పిలిచింది. తాజాగా మరో నటి ఓ స్కామ్ లో ఇరుకుంది. రేషన్ కుంభకోణంలో బెంగాలీ నటి రితుపర్ణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కోట్లాది రూపాయలు దారి మళ్లించి భారీ స్కామ్ కి  పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ..ఈడీ సమన్లు జారీ చేసింది. రేషన్ స్కామ్ ద్వారా సంపాదించిన డబ్బును బెంగాలీ సినీ ఇండస్ట్రీలో ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఆమెకు సంబంధించిన సినీ బ్యాంక్ అకౌంట్ల వివరాలతో నిజాం ప్యాలెస్‌లోని ఆఫీస్ కి రావాలని రావాలని ఈడీ అధికారులు సేన్‌గుప్తాకు చెప్పారు జూన్ 4వ తేదీన లోక్ సభ ఫలితాలు వెలువడిన తర్వాత రోజు జూన్ 5వ తేదీన కోల్‌కతా నగర శివారు ప్రాంతంలోని ED కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.అయితే.. రితుపర్ణకు ఈడీ సమన్లు పంపడం ఇదే తొలిసారి కాదు. 2019లో బెంగాల్‌ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మనీ లాండరీంగ్ చేసినట్టు ఆరోపణ నేపథ్యంలో అప్పట్లో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేశాయి. 2019లో రోజ్ వ్యాలీ పోంజీ స్కామ్‌కు సంబంధించి కూడా నటి రితుపర్ణ సేన్‌గుప్తాను విచారించింది.

ఇలా సినీ రంగానికి చెందిన వారు స్కామ్ లో ఇరుక్కోవడం కొత్తేమి కాదు. ఇప్పటికే కొందరు బాలీవుడ్ కి చెందిన వారు సినీ నటులు కూడా పలు కేసుల్లో నోటీసులు అందుకున్నారు. అంతేకాక కొందరు అయితే ఏకంగా జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా బెంగళూరు రేవ్ పార్టీ తరువాత తాజాగా బెెంగాల్ నటీ  కూడా రేషన్ స్కామ్ వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. మరి.. ఈమె కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే..మరికొన్ని రోజులు ఎదురూ చూడక తప్పదు. ఈమె జూన్ 5న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి.. అవుతదా లేదా అనేది జూన్ 5కి తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి