iDreamPost
android-app
ios-app

నాలుగేళ్లుగా పగతో రగిలిపోతున్న RCB.. రివేంజ్ స్టోరీతో ప్లేఆఫ్స్​కు రెడీ!

  • Published May 20, 2024 | 4:08 PMUpdated May 20, 2024 | 4:08 PM

ఎలాంటి ఆశల్లేని స్థితి నుంచి వరుస విజయాలతో రాయల్​గా ప్లేఆఫ్స్​లోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీ. అయితే నాలుగేళ్లుగా పగతో రగిలిపోతున్న ఆ జట్టుకు.. రివేంజ్​ తీర్చుకోవడానికి సరైన సమయం వచ్చేసింది.

ఎలాంటి ఆశల్లేని స్థితి నుంచి వరుస విజయాలతో రాయల్​గా ప్లేఆఫ్స్​లోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీ. అయితే నాలుగేళ్లుగా పగతో రగిలిపోతున్న ఆ జట్టుకు.. రివేంజ్​ తీర్చుకోవడానికి సరైన సమయం వచ్చేసింది.

  • Published May 20, 2024 | 4:08 PMUpdated May 20, 2024 | 4:08 PM
నాలుగేళ్లుగా పగతో రగిలిపోతున్న RCB.. రివేంజ్ స్టోరీతో ప్లేఆఫ్స్​కు రెడీ!

ఎలాంటి ఆశల్లేని స్థితి నుంచి వరుస విజయాలతో రాయల్​గా ప్లేఆఫ్స్​లోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీ. ఒక సమయంలో ఆ జట్టు ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్​ అవకాశాలు కేవలం ఒక్క శాతమే. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప బెంగళూరు క్వాలిఫై అవడం అసాధ్యంగా కనిపించింది. క్రికెట్ లవర్స్ ఆ టీమ్​ను పట్టించుకోవడం మానేశారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టైమ్​లో తప్ప మిగతా సమయంలో ఆర్సీబీ మ్యాచులను స్కిప్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని వారాల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. ఒక్కో మ్యాచ్​ను నాకౌట్​గా భావిస్తూ తమ రియల్ టాలెంట్​ను బయటపెట్టారు బెంగళూరు ఆటగాళ్లు. అటాకింగ్ అప్రోచ్​ను నమ్ముకొని సక్సెస్ బాట పట్టారు. గత ఆరు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయ్యారు. అయితే ఆర్సీబీ అసలైన కథను ఇప్పుడే మొదలుపెట్టనుంది.

ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పు కొట్టని ఆర్సీబీ.. ఈసారి దాన్ని సాధించడం పక్కా అని అభిమానులు నమ్ముతున్నారు. ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం, మంచి ఊపు మీద ఉండటంతో కప్​తో తిరిగిస్తుందని భావిస్తున్నారు. అయితే బెంగళూరు జట్టు టైటిల్​ను కొట్టడంతో పాటు రివేంజ్ తీర్చుకోవడం మీద కూడా ఫోకస్ పెడుతోందని తెలుస్తోంది. నాలుగేళ్లుగా మూడు జట్లపై పగతో రగిలిపోతోంది ఆర్సీబీ. దానికి ఈసారి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. డుప్లెసిస్ సేన రివేంజ్ స్టోరీలో మూడు జట్లు టార్గెట్​గా ఉన్నాయి. అవే ఈసారి ప్లేఆఫ్స్​కు చేరిన సన్​రైజర్స్ హైదరాబాద్, కోల్​కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్. ఈ మూడు జట్ల మీద పగతో రగిలిపోతోంది బెంగళూరు.

ఐపీఎల్-2020లో ప్లేఆఫ్స్​లో ఆర్సీబీని ఓడించింది సన్​రైజర్స్. కప్‌ కొడదామనుకున్న బెంగళూరు ఆశలపై నీళ్లు పోసింది ఎస్​ఆర్​హెచ్. ఆ మరుసటి ఏడాది కూడా ప్లేఆఫ్స్​లోనే ఆర్సీబీ కథ ముగిసింది. కేకేఆర్ వల్ల ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగింది. రెండేళ్ల కింద ఐపీఎల్-2022లో రాజస్థాన్ రాయల్స్ వల్ల ప్లేఆఫ్స్​ నుంచి నిష్క్రమించింది ఆర్సీబీ. ఇలా మూడు సార్లు కప్పు వేటలో ఆఖరు వరకు వచ్చి ఆగిపోయింది. దీంతో ఈ మూడు టీమ్స్ మీద డుప్లెసిస్ సేన కోపంతో ఊగిపోతోంది. ఈసారి కూడా కప్పు నెగ్గాలంటే ఈ మూడింటినీ బెంగళూరు ఓడించాలి. ఎలిమినేటర్​లో రాజస్థాన్​ను ఓడిస్తే.. క్వాలిఫయర్​-2కు అర్హత సాధిస్తుంది.

కేకేఆర్-ఎస్​ఆర్​హెచ్​లో ఓ జట్టును క్వాలిఫయర్​-2లో ఎదుర్కొంటుంది ఆర్సీబీ. ఒకవేళ అందులోనూ నెగ్గితే ఫైనల్స్​లో ఈ రెండింట్లో నుంచే ఒక జట్టును ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్లేఆఫ్స్ చేరిన మిగతా మూడు టీమ్స్​ను ఓడించి డుప్లెసిస్ సేన విజేతగా ఆవిర్భవిస్తే మాత్రం అది ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది చూసిన ఫ్యాన్స్.. దీన్ని దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అంటున్నారు. తన కథ ముగించిన మూడు టీమ్స్​ను ఓడించి కప్పు గెలిచేందుకు ఆర్సీబీ కోసం ఆయన రాసిన రివేంజ్ స్టోరీ ఇదని కామెంట్స్ చేస్తున్నారు. ఈసాలా కప్ నమ్దే అంటూ టీమ్ గెలుపు మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆర్సీబీ రివేంజ్ స్టోరీ ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి