Rohit Sharma: కెమెరామెన్​​కు దండం పెట్టిన రోహిత్.. ఇప్పటికే ఇరుక్కుపోయాను అంటూ..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి తెలిసిందే. గ్రౌండ్​తో పాటు బయట కూడా అతడు ఫన్నీగా ఉంటాడు. ఏదీ మనసులో దాచుకోకుండా అనిపించింది చెప్పేయడం అతడి స్టైల్.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి తెలిసిందే. గ్రౌండ్​తో పాటు బయట కూడా అతడు ఫన్నీగా ఉంటాడు. ఏదీ మనసులో దాచుకోకుండా అనిపించింది చెప్పేయడం అతడి స్టైల్.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి తెలిసిందే. గ్రౌండ్​తో పాటు బయట కూడా అతడు ఫన్నీగా ఉంటాడు. ఏదీ మనసులో దాచుకోకుండా అనిపించింది మాట్లాడటం అతడి స్టైల్. అయితే ఇది ఒక్కోసారి అతడ్ని చిక్కుల్లో కూడా పడేస్తోంది. రీసెంట్​గా కోల్​కతా నైట్ రైడర్స్​తో మ్యాచ్​కు ముందు ఆ టీమ్ కోచింగ్ బృందంలోని అభిషేక్ నాయర్​తో మాట్లాడుతూ కనిపించాడు హిట్​మ్యాన్. వీళ్ల భేటీకి సంబంధించిన వీడియో నెట్టింట హల్​చల్ చేసింది. తాను బిల్డ్ చేసిన టీమ్ ఇప్పుడు మునుపటిలా లేదని, ప్రతిదీ మారిపోయిందని, ఇదే తన లాస్ట్ ఇయర్ అంటూ అందులో రోహిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ముంబై ఇండియన్స్​ను రోహిత్ వీడటం ఫిక్స్ అని ఆ వీడియోను చూసి అందరూ అనుకున్నారు. వివాదాస్పదంగా మారిన ఆ వీడియోను కేకేఆర్ తర్వాత డిలీట్ చేసింది. తన మనసులోని విషయాలు ఆ వీడియో ద్వారా బయటకు పొక్కడంతో హిట్​మ్యాన్​ బాధపడినట్లు తెలుస్తోంది. అందుకే కాబోలు ఇవాళ లక్నోతో మ్యాచ్ సందర్భంగా కెమెరామెన్​ను చూడగానే దండం పెట్టేశాడు హిట్​మ్యాన్. మాజీ పేసర్ ధవల్ కులకర్ణితో మ్యాచ్​కు ముందు మాట్లాడుతూ కనిపించాడు రోహిత్. ఆ టైమ్​లో అటు వైపుగా కెమెరామెన్ రావడంతో ఆడియో ఆపేయాల్సిందిగా కోరాడు. ఒక ఆడియోతో తాను పడిన ఇక్కట్లు చాలని.. మ్యూట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి.. కెమెరామెన్​కు రోహిత్ దండం పెట్టడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments