iDreamPost
android-app
ios-app

వీడియో: ఢిల్లీలో మెట్రోలో మరో షాకింగ్ సీన్.. నలుగురు మహిళలు కలిసి!

ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నలుగురు మహిళలు ఊహించని పనికి తెర లేపారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మాారుతోంది. అసలేం జరిగిందంటే?

ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నలుగురు మహిళలు ఊహించని పనికి తెర లేపారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మాారుతోంది. అసలేం జరిగిందంటే?

వీడియో: ఢిల్లీలో మెట్రోలో మరో షాకింగ్ సీన్.. నలుగురు మహిళలు కలిసి!

గత కొంత కాలం నుంచి ఢిల్లీ మెట్రో వేదికగా నిత్యం ఏదో ఒక ఘటన వెలుగు చూస్తుంది. కొంతమంది యువతి, యువకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇన్ స్టా రీల్స్  చేసి ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇందు కోసం కొంతమంది యువత మెట్రోలో అందరి ముందే గలీజ్ పనులకు తెర లేపుతున్నారు. ఇక కొందరు ప్రేమికులు అయితే మెట్రోలో నలుగురు ఉన్నారన్న సోయి కూడా లేకుండా రొమాన్స్ కు తెర లేపుతున్నారు. దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటున్నారు. ఇక అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల ఢిల్లీ మెట్రోలో నలుగురు మహిళలు కలిసి ఎవరూ ఊహించని పనికి తెర లేపారు. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అదే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకు ఢిల్లీ మెట్రోలో ఈ మహిళలు ఏం చేశారంటే? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. నిత్యం ఎంతో మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి వెళ్తూ వస్తూ ఉంటారు. ఇదే మెట్రో స్టేషన్ ను వేదికగా చేసుకున్న కొందరు మహిళలు దారుణానికి పాల్పడ్డారు. వీళ్లు చేసిన పనికి ఏకంగా పోలీసులే బిత్తరపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది. అసలేం జరిగిందంటే? ఇటీవల రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో నలుగురు మహిళలు మెట్రోలో ఎక్కుతున్నామని అందరినీ నమ్మించే విధంగా నటించారు. ఈ క్రమంలోనే మెట్రో కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రయాణికులను వద్ద దొంగతనం చేయాలని అనుకున్నారు. ఇందు కోసం ఆ నలుగురు మహిళలు మెట్రో ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లారు.

అందరినీ తోసుకుంటూ ఈ మహిళను చుట్టుముట్టారు. ఇక రైలు వస్తుందనే క్రమంలోనే ఆమె వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకున్నారు. దీన్ని గమనించిన కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారి చివరికి పోలీసుల వరకు వెళ్లింది. దీన్ని చూసిన పోలీసులే ఖంగుతిన్నారు. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఎట్టకేలకు ఆ నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. అయితే ఈ మహిళలు గత కొంత కాలం నుంచి ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది. ఢిల్లీ మెట్రో రైలును వేదికగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఈ మహిళా గ్యాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి