iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకుంది.. భర్త చేసిన పని తట్టుకోలేక.. ఆ మహిళ

  • Published Jul 17, 2024 | 8:29 AMUpdated Jul 17, 2024 | 8:29 AM

Nellore Woman End Her Life In KGF: ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారు చేసిన పని ఇరు కుటుంబాలకు నచ్చలేదు. దాంతో వారు చేసిన పనితో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ వివరాలు..

Nellore Woman End Her Life In KGF: ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారు చేసిన పని ఇరు కుటుంబాలకు నచ్చలేదు. దాంతో వారు చేసిన పనితో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ వివరాలు..

  • Published Jul 17, 2024 | 8:29 AMUpdated Jul 17, 2024 | 8:29 AM
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. భర్త చేసిన పని తట్టుకోలేక.. ఆ మహిళ

ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. అందరిని వద్దనుకుని.. ప్రేమించని వాడే లోకంగా బతికింది. వారి వివాహం జరిగి మూడు నెలలు మాత్రమే అయ్యింది. లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న ఆ దంపతులు ఎంతో సంతోషంగా జీవితాన్ని ప్రారంభించారు. ఇక కలకాలం ఇలా ఉండాలనే భావించారు. కానీ వారు చేసిన పని.. ఇరు కుటుంబాలకు నచ్చలేదు. వారిని విడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వీటిని గమనించిన భర్త దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయం తెలిసిన సదరు మహిళ.. జీవితం మీద విరక్తి పెంచుకుంది. భర్త చేసిన పనిని జీర్ణించుకోలేకపోయింది. దాంతో ఆమె కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లో.. రోజుల వ్యవధిలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

కర్ణాటకలోని కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌)లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ కేజీఎఫ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య చేసుకోవడం ఆమె జీర్ణించుకోలేపోయింది. ప్రేమించిన భర్తను కోల్పోవడంతో.. కుంగిపోయింది. భర్త లేని లోకంలో తాను బతకలేనని భావించింది. అందుకే తలకు రాసుకునే నూనె తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇరు కుటుంబాల పెద్దలు.. నవ దంపతులను బలవంతంగా విడదీసి, వారిని వేరు చేయడంతోనే రోజుల వ్యవధిలో భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. మహిళ ఆత్మహత్యతో ఆ  ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఈ విషాద ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడుకు చెందిన కొండిపోగు జమీమా (27) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. తలకు రాసుకొనే నూనె తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు జమీమాకు కనియంపాడు చర్చి పాస్టర్‌ జాన్‌బాబుతో మే నెల 25వ తేదీన ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే జమీమా ప్రేమ వివాహం గురించి తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బంధువులు వారిని విడదీసి.. జమీమాను అదే నెల అనగా జూన్‌ 27న కర్ణాటకలోని కేజీఎఫ్‌లో ఉంటున్న బంధువుల వద్దకు పంపారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను విడదీయడంతో.. తీవ్ర మనస్తాపం చెందిన జాన్‌బాబు జూన్‌ 2న కోడూరు బీచ్‌లో ఆత్మహత్యకు చేసుకుని శవమై కనిపించాడు. అయితే అప్పటి నుంచి భర్త మృతి చెందిన విషయం జమీమాకు తెలియదు. ఇక ఇటీవల ఆమెకు జాన్‌ బాబు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. వెంటనే ఇంట్లోని తలకు రాసుకొనే నూనె తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో జమీమా గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి