iDreamPost
android-app
ios-app

దారుణం: అందంగా లేడని భర్తకు నిప్పు పెట్టి చంపేసిన భార్య!

అందంగా లేడని భర్తకు నిప్పు పెట్టి చంపేసిన భార్య. వినటనాకి నమ్మశక్యంగా లేకున్న ఈ వార్త నిజం. చాలా ఏళ్ల కిందట జరిగిన ఈ కేసులో నిందితురాలికి ఇటీవల న్యాయస్థానం ఊహించని షాకిచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందటే?

అందంగా లేడని భర్తకు నిప్పు పెట్టి చంపేసిన భార్య. వినటనాకి నమ్మశక్యంగా లేకున్న ఈ వార్త నిజం. చాలా ఏళ్ల కిందట జరిగిన ఈ కేసులో నిందితురాలికి ఇటీవల న్యాయస్థానం ఊహించని షాకిచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందటే?

దారుణం: అందంగా లేడని భర్తకు నిప్పు పెట్టి చంపేసిన భార్య!

సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాలను చూస్తుంటే నవ్వాలో, బాధపడాలో అస్సలు అర్థం పరిస్థితి. మాములుగా కొంత మంది వ్యక్తులు అందమైన వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు. ఇక మరి కొంతమంది మాత్రం.. అందం లేకున్నా సరే చక్కని గుణం కలిగిన వ్యక్తులు ఉంటే సరిపోతుందని అనుకుంటుంటారు. కానీ, ఓ చోట మాత్రం.. ఓ భార్య అందంగా లేడని భర్తకు నిప్పు పెట్టి అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత తనకేం సంబంధం లేదని కొత్త నాటకానికి తెర తీసింది. ప్రమాదవశాత్తు నా భర్త చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఇక అసలు విషయం బయటకు రావడంతో ఆ మహిళ నోట్లో నీళ్లు నమిలింది. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. విచారించిన న్యాయస్థానం ఇటీవల నిందితురాలికి కఠిన శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

మీడియా కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ప్రేమ్ శ్రీ అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే గతంలో ఆమె తల్లిదండ్రులు కూతురుకి పెళ్లి చేయాలని భావించారు. ఇందులో భాగంగానే కుర్హ్ ఫతేగడ్ కు చెందిన సత్యవీర్ ను పెళ్లి చేసుకోవాలని సూచించారు. కానీ, నల్లగా ఉన్నాడని ప్రేమ్ శ్రీ అతనితో పెళ్లికి నిరాకరించింది. ఆమె తల్లిదండ్రులు, బంధువులు బలవంతం చేసి మొత్తానికి సత్యవీర్ తో 2017లో ప్రేమ్ శ్రీకి పెళ్లి జరిపించారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆ యువతికి అతనితో సంసారం చేయడానికి ఇష్టపడలేదు. కానీ, తప్పని పరిస్థితుల్లో ప్రేమ్ శ్రీ కొన్నేళ్ల పాటు అతనితో గడిపింది.

ఇక నా వల్ల కాదని ప్రేమ్ శ్రీ కుటుంబ సభ్యులకు వివరించింది. అలా చేయడం కరెక్ట్ కాదని ఆమె తల్లిదండ్రులు కూతురికి అన్ని విధాలుగా నచ్చ చెప్పారు. ఇలా అయితే కాదని భావించిన ఆ యువతి.. 2019లో భర్త నిద్రపోతుండగా అతని ఒంటిపై పెట్రోల్ నిప్పు అంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సత్యవీర్.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుని భార్యను విచారించారు. ఆ మహిళ మొదట్లో నాకేం సంబంధం లేదని, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని ఆమె అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, చివరికి పోలీసుల స్టైల్ లో విచారించే సరికి.. ప్రేమ్ శ్రీ అసలు నిజాన్ని బయటపెట్టింది.

నాకు నా భర్త అంటే అస్సలు ఇష్టం లేదు. నల్లగా ఉన్నాడని నేను అతనితో పెళ్లికి ఇష్ట పడలేదు. అయినా సరే నా తల్లిదండ్రులు, బంధువులు నాకు బలవంతంగా అతనితో పెళ్లి జరిపించారు. ఇది నచ్చకే నేను నా భర్తను పెట్రోల్ పోసి నిప్పటించానని తన నేరాన్ని అంగీకరించింది. అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు. ఇక ఇదే కేసును ఇటీవల విచారించిన న్యాయస్థానం ప్రేమ్ శ్రీకి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. నల్లగా ఉన్నాడని భర్తకు నిప్పు పెట్టిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpokerklaspokerklaspokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş