iDreamPost
android-app
ios-app

టిఫిన్‌ చేసి, వేరే రూములోకి వెళూతూ ఉంది.. ఇంతలోనే..

టిఫిన్‌ చేసి, వేరే రూములోకి వెళూతూ ఉంది.. ఇంతలోనే..

నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, తుమ్మడము గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయి రెడ్డి కుమారుడి భార్య కన్నుమూసింది. టిఫిన్‌ చేసొచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఆమె కుప్పకూలింది. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయి రెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డికి గత సంవత్సరం ఏప్రిల్‌ నెలలో.. డిండి మండలం నేరెడుకొమ్ము గ్రామానికి చెందిన లహరితో పెళ్లి అయింది. వల్లభ్‌, లహరిలు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.

శుక్రవారం ఇంట్లో ఆమె టిఫిన్‌ చేసింది. టిఫిన్‌ చేసిన కొద్దిసేపటి తర్వాత వేరే రూముకు వెళ్లడానికి పైకి లేచింది. అలా నడుస్తూ రూము దగ్గరకు వెళ్లిపోయింది. ఆ సమయంలో ఏమైందో ఏమో తెలియదు కానీ, ఉన్నట్టుండి కుప్పకూలి పోయింది. అది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, మార్గం మధ్యలోనే ఆమె తుది శ్వాస విడిచింది. ఆసుపత్రి వైద్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించారు. ఇక, లహరి మరణంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పెళ్లయిన 15 నెలలకే ఆమె ఇలా అర్థాంతరంగా మరణించటంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో ఆకస్మిక మరణాలు చాలా ఎక్కువయ్యాయి. గుండెపోట్ల కారణంగా చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ మరణిస్తున్నారు. అప్పటివరకు బాగా ఉన్న వారు ఉన్నట్టుండి చనిపోతున్నారు. దేశ వ్యాప్తంగా నిత్యం ఒకటైనా ఇలాంటి కేసు సంభవిస్తోంది. మరి, పెళ్లైన 15 నెలలకే లహరి ఆకస్మికంగా మరణించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet Girişcasibom girişholiganbet girişholiganbetvaycasinomarsbahis girişJojobet