iDreamPost
android-app
ios-app

కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది.. 22 రోజులు దాటినా..!

కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది.. 22 రోజులు దాటినా..!

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ కు చెందిన ఈ యువతి స్థానికంగా ఉన్న కాలేజీలో చదువుకుంటుంది. అయితే ఈ నెల 8న ఈ అమ్మాయి కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి వెళ్లింది. ఆ రోజు రాత్రి అయినా యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు బంధువులకు ఫోన్ చేసి కూతురు ఆచూకి గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సైతం గాలించారు. కానీ, ఆ అమ్మాయి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22 రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు ఆ యువతి ఆచూకి లభించలేదు. ఇక చేసేదేం లేక ఆ యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగానే పోలీసులు ఆమె చదువుకునే కాలేజీలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇదే కాకుండా ఈ యువతి స్నేహితులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు.. సొంత బాబాయ్ అయిన నాగరాజు అనే వ్యక్తి ఈ యువతిని తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ అమ్మాయిని అతడు ఎక్కడికి తీసుకెళ్లాడు? అసలు ఇద్దరు ఏమైపోయారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ యువతి ఆచూకి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఆ యువతిని తీసుకెళ్లాడని అనుమానిస్తున్న వ్యక్తిపై గతంలో అత్యాచార కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. కాగా, కూతురు అదృశ్యం అయి 22 రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఆచూకి లభించకోవడంతో తల్లిదండ్రులు ఖంగారు పడుతున్నారు.

  • ఇది కూడా చదవండి: కోరుట్ల దీప్తి మృతి కేసులో బిగ్ ట్విస్ట్! తమ్ముడికి ఆడియో పంపిన చందన!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి