తప్పగా ప్రవర్తించాడు.. తుప్పు వదల గొట్టింది!

లోన్‌ ఇవ్వాలంటే ఓ రాత్రి తనతో గడపాలంటూ తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఓ మహిళ సరిగ్గా బుద్ధి చెప్పింది. చెయ్యి పట్టుకున్న అతడికి చెప్పుతో బుద్ధి చెప్పింది. పొలాల దగ్గరే అతడి తుప్పు వదిల్చింది. ఈ సంఘటన కర్ణాటకలోని కొప్పల్‌ తాలూకా చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కొప్పల్‌ తాలూకా హళబండిహలాపుర గ్రామానికి చెందిన నాగమ్మ భర్తతో కలిసి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. గోదావరి మైక్రో ఫినాన్స్‌లో పని చేస్తున్న యమనూరప్ప అనే వ్యక్తి నాగమ్మపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని భావించాడు. నాగమ్మ అవసరం ఉండి గోదావరి మైక్రో ఫినాన్స్‌లో లోన్‌ కోసం అప్లై చేసుకుంది.

ఆమెకు లోన్‌ వచ్చింది. అయితే, ఆ లోన్‌ డబ్బులు ఇవ్వటానికి యమనూరప్ప గొడవ మొదలుపెట్టాడు. తన మనసులో మాట ఆమె ముందు బయటపెట్టాడు. తనతో ఓ రాత్రి గడిపితేనే డబ్బులు ఇస్తానని స్పష్టం చేశాడు. ఆమె చెయ్యి పట్టుకుని తప్పుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన నాగమ్మ, ఆమె తల్లి యమనూరప్పపై విరుచుకుపడ్డారు. చెప్పులతో అతడ్ని చావ కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments