ఖమ్మంలో దారుణం.. భార్యను చంపి భర్త ఏం చేశాడో తెలుసా?

ఖమ్మంలో దారుణం.. భార్యను చంపి భర్త ఏం చేశాడో తెలుసా?

ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతను చేసిన పనికి అంతా షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు భార్యను భర్త ఎందుకు చంపాడు? ఆ తర్వాత జరిగిందేంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా టేకులపల్లి పరిధిలోని జయనగర్ లో భూక్య సీతారాములు-పార్వతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా కాలం కిందట వివాహం జరిగింది. వీరి ఇద్దరు పిల్లలు ప్రస్తుతం బీటెక్ చేస్తున్నారు. కాగా, సీతారాములు స్థానిక స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి సీతారాములు.. భార్య పార్వతిని తరుచు అనుమానించేవాడని తెలుస్తుంది. ఇదే విషయంపై అనేక సార్లు గొడవలు కూడా జరగడంతో పెద్దలు కలగజేసుకుని పంచాయితీ పెట్టించి సముదాయించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు.

ఇక కోపంతో ఊగిపోయిన సీతారాములు.. భార్యను ఇంట్లో దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో తెలియక భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతి కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పార్వతిని అలా చూసి షాక్ గురై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మృతురాలి సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: ఎలుకను బైక్‌తో తొక్కించి చంపిన వ్యక్తి.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

Show comments