iDreamPost
android-app
ios-app

డబ్బు కోసం నీఛానికి దిగిన భర్త.. మరీ ఇంత ఘోరమా?

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త, అతని కుటుం సభ్యులు చెప్పిన మాటలు విన భార్యపై వేధింపులకు పాల్పడ్డారు. వీటిని భరించలేని ఆ మహిళ ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఇక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త, అతని కుటుం సభ్యులు చెప్పిన మాటలు విన భార్యపై వేధింపులకు పాల్పడ్డారు. వీటిని భరించలేని ఆ మహిళ ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఇక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

డబ్బు కోసం నీఛానికి దిగిన భర్త.. మరీ ఇంత ఘోరమా?

ఆ మహిళ పేరు ఐశ్వర్య. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఓ కంపెనీ యజమానికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ భార్యాభర్తల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. దీంతో పాటు వీరి వ్యాపారం కూడా లాభాల్లో దూసుకెళ్లింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఆమె భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టారు. వీటిని భరించలేని ఐశ్వర్య.. ఇటీవల పుట్టింటికి వెళ్లి పోయింది. అయితే ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ వివాహిత సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో ఐశ్వర్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని విజయనగరలో సుబ్రమణ్య గౌడ-ఉష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐశ్వర్య అనే కూతురు ఉంది. ఈమె గతంలో అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసింది. కాగా, ఐదేళ్ల కిందట ఐశ్వర్యను ఆమె తల్లిదండ్రులు సుళయ పరిధిలోని కనకమలు ప్రాంతానికి చెందిన డైరీరీచ్ ఐస్ క్రీమ్ కంపెనీ ఓనర్ అయిన రాజేష్ కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత భర్త రాజేష్ కంపెనీని రన్ చేస్తుండగా, భార్య ఐశ్వర్య బెంగుళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. అలా చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది.

కానీ, ఐశ్వర్యతో తండ్రితో ఉన్న గొడవల కారణంగా వీరి సంసారంలో వీరి బంధువులైన రవింధ్రతో పాటు మరి కొంతమంది ఐశ్వర్య భర్త రాజేష్ కు లేని పోని అబద్దాలు చెప్పారు. వీరి మాటలు విని ఈ మహిళ భర్త రాజేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఐశ్వర్యను అనేక రకాలుగా వేధించారట. దీంతో పాటు అదనపు కట్నం కోసం నరకం చూపించినట్లుగా సమాచారం. ఇక రాను రాను వీరి వేధింపులు మరింత ఎక్కువవడంతో ఈ వివాహిత 20 రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు గడిపింది. అయితే గత నెల 26న ఐశ్వర్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు.. కూతురి భర్త రాజేష్ అతని తల్లిదండ్రులు, బంధువుల పేర్ల మీద పోలీసులు ఫిర్యాదు చేేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి