karnataka Crime News: అసలు వీడు భర్తేనా? నడి రోడ్డుపై అందరి ముందే భార్యపై దారుణం!

అసలు వీడు భర్తేనా? నడి రోడ్డుపై అందరి ముందే భార్యపై దారుణం!

కర్ణాటకలోని దాారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకు ఈ దుర్మార్గుడు ఎంతకు తెగించాడో తెలుసా?

కర్ణాటకలోని దాారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకు ఈ దుర్మార్గుడు ఎంతకు తెగించాడో తెలుసా?

కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన ఈ భార్యాభర్తలకు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే కొంత కాలానికి భర్త తాగుడుకు బానిసయ్యాడు. దీంతో రోజూ తాగి ఇంటికొచ్చేవాడు. ఇంతే కాకుండా భార్యతో గొడవకు దిగేవాడు. ఇలా ఈ దుర్మార్గుడు చాలా కాలం నుంచి భార్యను వేధిస్తూ వచ్చాడు. భర్త మారతాడని భార్య ఎంతో ఆశించింది. కానీ, ఆ మార్పు అతడిలో అస్సలు కనిపించలేదు. ఇక ఇంతే కాకుండా ఇతగాడు మరో దారుణాకి ఒడిగట్టాడు. ఇటీవల నడి రోడ్డుపై అందరి ముందే కట్టుకున్న భార్య అని చూడకుండా కిరాతకానికి పాల్పడ్డాడు. ఇదంతా చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జరిగిన దారుణం చూసి పోలీసులు కూడా షాకయ్యారు. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ చల్లకెరె పరిధిలోని హెగ్గెరు గ్రామంలో కుమారస్వామి-ఆశ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత రెండేళ్ల కిందట వివాహం జరిగింది. అప్పటి నుంచి ఏడాది పాటు ఈ దంపతులు సంతోషంగానే గడిపారు. కానీ, భర్త కుమారిస్వామి మాత్రం తాగుడుకు బానిసయ్యాడు. తరుచు మద్యం సేవించి ఇంటికొచ్చేవాడు. ఇంతటితో సరి పెట్టకుండా.. నీకు ఇతర మగాళ్లతో సంబంధం ఉందని భార్య ఆశను వేధించేవాడు. అలాంటిది ఏం లేదని ఈ మహిళ ఎన్నోసార్లు భర్తకు వివరించే ప్రయత్నం చేసింది.

అయినా ఇతగాడు ఏ మాత్రం అర్థం చేసుకోలేదు. ఇలా చాలా రోజుల నుంచి కుమారిస్వామి ఆశను వేధిస్తూ టార్చర్ చేసేవాడు. ఇతనితో ఉండడం నా వల్ల కాదు అనుకుందో ఏమో కానీ.. ఆశ భర్త కుమారస్వామికి విడాకులు ఇవ్వాలని అనుకుంది. ఇందుకోసం ఇటీవల కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అయితే ఈ క్రమంలోనే చల్లకెరె బస్టాండ్ వద్ద భర్త కుమారస్వామి భార్య ఆశతో గొడవకు దిగాడు. దీంతో క్షణికావేశంలో ఊగిపోయిన కుమారస్వామి.. భార్య ఆశపై అందరి ముందు కొడవలిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆశ రక్తపు మడుగులో పడిపోయింది.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న ఆశ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ తర్వాత ఆశ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భర్తే సర్వస్వం అనుకుని నమ్మి వచ్చిన ఆశను అతి దారుణంగా హత్య చేసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Show comments