iDreamPost
android-app
ios-app

రెండేళ్ల కిందట పెళ్లి.. డబ్బు కోసం నీచానికి దిగిన భర్త!

ఈ వివాహిత పేరు నెహర్ అంజుం. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటి నుంచి కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. కట్ చేస్తే.. నెహర్ అంజుం ఇటీవల శవమై కనిపించింది. అసలేం జరిగిందంటే?

ఈ వివాహిత పేరు నెహర్ అంజుం. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటి నుంచి కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. కట్ చేస్తే.. నెహర్ అంజుం ఇటీవల శవమై కనిపించింది. అసలేం జరిగిందంటే?

రెండేళ్ల కిందట పెళ్లి.. డబ్బు కోసం నీచానికి దిగిన భర్త!

పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నెహర్ అంజుం. గతంలో ఈమెకు అఫ్జల్ బేగ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫిగానే సాగుతూ వచ్చింది. ఇక భర్త ఓ చోట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. కూతురుని అత్తింటి వాళ్లు బాగానే చూసుకుంటున్నట్లు నెహర్ అంజుం తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ, చివరికి ఇలా జరుగుతుందని మాత్రం నెహర్ అంజుం తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు తెలుసుకోలేకపోయారు. జరిగింది తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలా జరుగుతుందని మాత్రం వాళ్లు అస్సలు ఊహించలేదు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక కోలారు పరిధిలోని వినాయక నగర్ లో అఫ్జల్ బేగ్- నెహర్ అంజుం (22) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి తంతులో భాగంగానే రూ.4 లక్షల కట్నంతో పాటు ఇంటి సామాగ్రిని కూడా కొనిచ్చారు. అలా పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా సంసారాన్ని కొనసాగించారు. కానీ, రాను రాను భర్త, అతని కుటుంబ సభ్యులు అసలు రూపాన్ని బయట పెట్టారు. మరింత కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట్లో ఇవన్ని కామన్ అనుకుంది నెహర్ అంజుం. అయితే రాను రాను భర్త, ఆమె తల్లిదండ్రులు నిచానికి దిగడంతో తట్టుకోలేకపోయింది.

గత నెల 25 నుంచి ఆ వివాహితను మరింత టార్చర్ చేయడం మొదలు పెట్టారు. దీంతో తట్టుకోలేని నెహర్ అంజుం.. ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెకు సర్దిచెప్పి ఈ నెల 5న తిరిగి అత్తింటికి పంపించారు. నెహర్ అంజుం కుటుంబ సభ్యులు కూతురు అత్తింటి వాళ్లకు ఫోన్ చేసి.. మేమే ఈ మధ్యే మా కుమారుడి వివాహం చేశామని, ఇప్పట్లో ఇవ్వలేమని చెప్పారు. ఇక అత్తింటి వాళ్లు అలా చెప్పడంతో అఫ్జల్ బేగ్ కోపంతో ఊగిపోయాడు. అదనపు కట్నం తేవాల్సిందేనంటూ తరుచు భార్య నెహర్ అంజుంను వేధింపులకు పాల్పడేవాడు.

కట్ చేస్తే.. ఈ నెల 5న ఉన్నట్టుండి నెహర్ అంజుం ఇంట్లో శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కూతురిని అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కూతురి భర్త, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం తేవాలని గత కొంత కాలంగా వేధించారని, తీసుకురాని కారణంగానే నెహర్ అంజుంని హత్య చేసి చివరికి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్టుండి నెహర్ అంజుం శవమై కనిపించడంతో ఆమె ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ గురవుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి