షాపింగ్ కోసమని హైదరాబాద్ వెళ్లింది.. పాపం, అంతలోనే!

షాపింగ్ కోసమని హైదరాబాద్ వెళ్లింది.. పాపం, అంతలోనే!

ఈమె పేరు షబానా అంజుమ్, వయసు 48 ఏళ్లు. త్వరలో బంధువుల్లో ఒకరిది నిశ్చితార్థం ఉంది. అయితే, షాపింగ్ కోసమని బంధువులతో పాటు కలిసి షబానా ఇటీవల హైదరాబాద్ కు వెళ్లింది. అంతా కలిసి ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో నచ్చిన బట్టలు కొన్నారు. ఇక అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి పయనమయ్యారు. వీరి వాహనం హైదరాబాద్ దాటి దాదాపుగా వీరి ప్రాంతం వరకు వెళ్లింది. కట్ చేస్తే.. పాపం, షబానా అంజుమ్ వారి బంధువుల ముందే ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా అజ్మత్ పురలో షబానా అంజుమ్ (48) అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే, త్వరలో ఆమె బంధువైన అఫ్జల్ రెహ్మాన్ ది ఎంగేజ్ మెంట్ ఉంది. షాపింగ్ కోసం షబానా అంజుమ్ ఆమె బంధువులతో కలిసి ఆదివారం కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. అక్కడి చేరుకుని నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో కొత్త బట్టలు కొన్నారు. ఇక అనంతరం అదే రోజు అర్థరాత్రి కరీంనగర్ కు తిరిగి పయనమయ్యారు.

కాగా, వీరు ప్రయాణిస్తున్న కారు సోమవారం తెల్లవారు జామున కరీంనగర్ పరిధిలోని ఆటో నగర్ లో డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి స్వల్ప గాయాలవ్వగా, షబానా మాత్రం తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో షబానా ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిందని తెలుసుకుని వారి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments