శంషాబాద్‌లో మరో దిశ ఘటన.. పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణం

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా సరే ఆడవారి పట్ల చోటు చేసుకుంటున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. కొనాళ్ల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ ఘటన మాదిరి దారుణమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను హత్య చేసి.. పెట్రోల్‌ పోసి తగలబెట్టిన దారుణం వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ శంషాబాద్ ఆర్జీఐఏ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాస కాలనీలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలంరేపింది. మహిళను హత్యచేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన దారుణం వెలుగు చూడటంతో.. జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి.. కాల్చినట్లు అనుమానిస్తున్నారు. మహిళ ఎవరు.. ఎందుకు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన మహిళ వయసు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మహిళను అత్యాచారం చేసి ఆపై హత్యా చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన మహిళకు సంబంధించి ఏవైనా మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

మహిళ ఎవరు, ఏంటి అనే దానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో దారుణం చోటు చేసుకున్న కాలనీలోని సీసీ కెమెరాలు క్షుణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులు ఎవరనేది గుర్తించే పనిలో ఉన్నారు. మహిళకు, దారుణానికి పాల్పడిన వారి మధ్య ఏవైనా విబేధాలు తలెత్తాయా.. అందుకే ఈ దారుణం చోటు చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Show comments