iDreamPost
android-app
ios-app

మాదాపూర్ లో నారాయణ కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య!

మాదాపూర్ లో నారాయణ కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య!

గత కొన్ని రోజుల నుంచి విద్యార్థులు కాలేజీలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఈ వరుస ఘటనలు మరువకముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో తోటి విద్యార్థులతో పాటు కాలేజ్ యాజమన్యం ఒక్కసారిగా షాక్ గురైంది. దీంతో పోలీసులు హుటాహుటిన కాలేజ్ క్యాంపస్ కు చేరుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని ములుగు జిల్లాకు చెందిన కనకరాజు (17) అనే విద్యార్థి మధాపూర్ లోని నారాయణ కాలేజ్ లో బైపీసీ సెకండీయర్ చదువుతున్నాడు. అయితే ఇతడు ఈ నెల 8వ తేదిన ఈ కాలేజీలో జాయిన్ అయి క్యాంపస్ లోనే ఉంటున్నట్లు తెలుస్తుంది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కనకరాజు శుక్రవారం గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు అప్రమత్తమై కాలేజీ యాజమన్యానికి తెలియజేశారు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కనకరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మరణవార్త తెలుసుకుని మృతుని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: చేసిన అప్పు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డ యువకుడు!