iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం!

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. శనివారం జూబ్లీహిల్స్ లో దాదాపు రూ.3లక్షల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నిందితుడి వద్ద ఉన్న హాయిష్ ఆయిల్ ను కూడా సీజ్ చేశారు.

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. శనివారం జూబ్లీహిల్స్ లో దాదాపు రూ.3లక్షల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నిందితుడి వద్ద ఉన్న హాయిష్ ఆయిల్ ను కూడా సీజ్ చేశారు.

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం!

ఇప్పటికి హైదరాబాద్ లో చాలా సార్లు పోలీసుల డ్రగ్స్ పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో సిని పరిశ్రమకు చెందిన ఎందరో హీరో, హీరోయిన్ల పేర్లు బయటకొచ్చాయి. ఆ తర్వాత అధికారులు తీగ లాగితే డొంక కదిలి మరి కొందరి సెలబ్రెటీల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తేలింది. ఈ ఘటనతో అధికారులు వీరిని అనేక సార్లు విచారణకు పిలిచారు. అయితే ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ పేరు వినిపించిన విషయం తెలిసింది. ఈ హీరో బ్యాంక్ ఖాతాల నుంచి నైజీరియన్ల ఖాతాలకు డబ్బులు వెళ్లినట్లుగా అధికారులు అనుమానించారు. దీంతో అతడిని విచారణకు పిలిచి అనేక ప్రశ్నలు సందించారు.

అయితే ఈ ఘటనలు మరువకముందే నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. శనివారం జూబ్లీహిల్స్ లో దాదాపు రూ.3లక్షల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నిందితుడి వద్ద ఉన్న హాయిష్ ఆయిల్ ను కూడా సీజ్ చేశారు. ఇతడు గుంటూరు జిల్లాకు చెందిన జగీష్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుపడడంతో తీవ్ర కలకలంగా మారింది.