iDreamPost
android-app
ios-app

అసలు వీడు మనిషేనా? భార్య అని చూడకుండా బాత్ రూమ్ శుభ్రం చేసే..!

అసలు వీడు మనిషేనా? భార్య అని చూడకుండా బాత్ రూమ్ శుభ్రం చేసే..!

భార్యాభర్తలు అన్నాక గొడవలు జరడం సహజం. ఇంత దానికే కొందరు భర్తలు ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ సంసారాలను ఆగం చేసుకుంటున్నారు. భార్య మాట వినడం లేదని, చెప్పిన పని చేయడం లేదనే కారణాలు చూపి భార్యలను వేధిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వారిని హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే హద్దులు దాటి ప్రవర్తించాడో వ్యక్తి. ఇటీవల భార్యతో గొడవ పడి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. బాత్ రూమ్ కడిగే ఓ వస్తువుతో తన భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఇంతకు ఆ వ్యక్తి ఏం చేశాడు? ఈ దంపతుల మధ్య గొడవకు కారణం ఏంటి? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న రహమత్ నగర్ లో మహమ్మద్ అలీ-అప్సర బేగం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ, కొన్ని రోజులు గడిచిందో లేదో.. ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి పడ్డాయి. దీంతో గత కొంత కాలంగా వీళ్లిద్దరూ గొడవ పడుతూనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగే ఆదివారం కూడా ఈ దంపతులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే భర్త మహమ్మద్ అలీకి కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.

క్షణికావేశంలో ఏం చేయాలో అర్థం కాక బాత్రూమ్ కడిగే యాసిడ్ ని భార్య అప్సర బేగం ముఖంపై పోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ పెద్దగా అరిచింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు మహమ్మద్ అలీ దారుణంపై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తుంది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetMadridbet