iDreamPost
android-app
ios-app

దారుణం.. మహిళ కళ్లు పీకేసి, ప్రైవేట్‌ పార్ట్స్‌ ఛిద్రం చేశారు!

  • Published Jul 10, 2023 | 5:15 PM Updated Updated Jul 10, 2023 | 5:15 PM
  • Published Jul 10, 2023 | 5:15 PMUpdated Jul 10, 2023 | 5:15 PM
దారుణం.. మహిళ కళ్లు పీకేసి, ప్రైవేట్‌  పార్ట్స్‌ ఛిద్రం చేశారు!

దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లిన ఆడవారికి భద్రత లేకుండా పోతోంది. తాజాగా ఓ మహిళను అత్యంత కిరాతంగా హతమార్చారు. బతికి ఉండగానే కళ్లు పీకేసి, వక్షోజాలను కోసేసి, ప్రైవేట్‌ పార్ట్స్‌ను ఛిద్రం చేశారు. ఈ దారుణం ఘటన బిహార్‌లోని ఖగారియా జిల్లాలో చోటు చేసుకుంది.

పొలం పనులకు వెళ్లిన 45 ఏళ్ల సులేఖా దేవి అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా చంపేశారు. ఆమె తన సొంత పొలం పని చేసుకుంటుండగా.. కొంతమంది వచ్చి ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి కళ్లు పీకేశారు. వక్షోజాలను కోసేశారు. అలాగే ఆమె ప్రైవేట్‌ పార్ట్స్‌ను రాళ్లతో కొట్టి ఛిద్రం చేశారు. 2014లో సులేఖా దేవి భర్తను, మామను సైతం కొంతమంది కాల్చి చంపేశారు. ఆ మర్డర్‌ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి గతేడాది బెయిల్‌పై విడుదల అయ్యాడు.

ఇప్పుడు సులేఖా దేవి హత్యలో తన హస్తం ఏమైనా ఉందానే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. ఈ వరుస హత్యల వెనుక భూ వివాదం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ గొడవల కారణంగానే గతంలో సులేఖా భర్త, మామను చంపినవాళ్లే ఇప్పుడు ఈమెను కూడా హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, హత్య జరిగిన తీరు మాత్రం స్థానికులను భయభ్రంతులకు గురిచేస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.