కస్టమర్లకు JIO దివాలి ఆఫర్.. ఫ్రీగా 5జీ డేటా!

Reliance Jio: ప్రస్తుతం పండగల సీజన్ ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలోనే అన్నీ షాపింగ్ మాల్స్ ఫెస్టివల్ ఆఫర్స్ ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలయన్స్ జియో కూడా తమ కస్టమర్ల కోసం ఇప్పటి నుంచే దీపావళి ఫెస్టివల్ ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఇక ఆఫర్ నేటి నుంచే మొదలైంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటి, దాని వివరాలేంటో తెలుసుకుందాం.

Reliance Jio: ప్రస్తుతం పండగల సీజన్ ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలోనే అన్నీ షాపింగ్ మాల్స్ ఫెస్టివల్ ఆఫర్స్ ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలయన్స్ జియో కూడా తమ కస్టమర్ల కోసం ఇప్పటి నుంచే దీపావళి ఫెస్టివల్ ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఇక ఆఫర్ నేటి నుంచే మొదలైంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటి, దాని వివరాలేంటో తెలుసుకుందాం.

పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఆన్ లైన్ మొదలుకొని, ఆప్ లైన్ వరకు అన్నీ షాపింగ్ మాల్స్ కు గిరాకీ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఆయా షాపింగ్ మాల్ సంస్థలు కూడా కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు వివిధ రకాల ఆఫర్స్ ను ప్రకటిస్తుంటారు. అయితే ప్రస్తుతం పండగల సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్ లో ఏ షాపింగ్ మాల్ లో చూసిన అనేక ఆఫర్లు ముంచెత్తుతున్నాయి. వివిధ రకాల వస్తువులపై డిస్కౌంట్ ధరలతో జోరుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్ మొత్తం పండగల షాపింగ్ మాల్ తో కళకళలాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో కూడా తమ కస్టమర్ల కోసం ఇప్పటి నుంచే దీపావళి ఫెస్టివల్ ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఇక ఆఫర్ నేటి నుంచే మొదలైంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటి, దాని వివరాలేంటో తెలుసుకుందాం.

రిలయన్స్ జియో తాజాగా తమ వినియోగదారులకు దీపావళి ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. ముఖ్యంగా తమ యూజర్లకు ఏడాది పాటు ఉచితంగా జియో ఎయిర్ ఫైబర్ సేవలను, ఏడాది పాటు వార్షిక మొబైల్ రీచార్జిని అందించనుంది. పైగా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే సదుపాయం కలిగిస్తుంది. అయితే ఈ ఆఫర్ నేటి నుంచి అనగా సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3 వరకు మాత్రమే ఉంటుంది. మరి, ఇంతకీ ఈ ఆఫర్ ను ఎలా వినియోగించుకోవాలి, దీని షరతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ జియో అందిస్తున్న ఈ బంఫర్ ఆఫర్ ను పొందటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే కస్టమర్లు ఈ ఆఫర్ పొందడం కోస ఏదైనా రిలయన్స్ డిజిటల్, మై జీయో స్టోర్ లో రూ.20 వేల కంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తే కచ్చితంగా ఈ ఆఫర్ ను వర్తిస్తుంది.పైగా ఏడాది పాటు ఉచితంగా ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ అందుకుంటారు. అలాగే ఇప్పటికే జియో ఎయిర్ ఫైబర్ వినియోగిస్తున్న కస్టమర్లు రూ.2,222తో మూడు నెలల దీపావళి ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ కు అర్హులవుతారు.

ఇక వీరితో పాటు జియో ఫైబర్ వినియోగదారులు కూడా వన్ టైమ్ అడ్వాన్స్ రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ప్రయోజనం పొందుతారు. ఇకపోతే ఈ ఆఫర్ లో భాగంగా వినియోగదారులు 2024 నవంబర్ నుంచి 2025 అక్టోబర్ వరకూ ప్రతి నెలా ఒక్క కూపన్ చొప్పున 12 కూపన్లు పొందుతారు. అయితే ప్రతి కూపాన్ కూడా వినియోగదారుడి యాక్టివ్ జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ విలువతో సరిపోతుంది. అనగా..  రిలయన్స్ డిజిటల్, మైజియో, జియో పాయింట్, జియో మార్ట్ లతో వీటిని రీడిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు దాన్ని స్వీకరించిన 30 రోజుల లోపు ఎలక్ట్రానిక్స్‌ పై రూ. 15వేలు అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి, కస్టమర్ల కోసం రిలియన్స్ జియో దివాలి కానుకగా ప్రకటించిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments