iDreamPost
android-app
ios-app

Railway ప్రయాణికులకు షాకింగ్ రూల్స్.. తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు!

  • Published Nov 05, 2024 | 4:56 PM Updated Updated Nov 05, 2024 | 4:56 PM

Indian Railways: రైల్వే శాఖ తాజాగా కొత్త రూల్స్ పెట్టింది. అవి తెలుసుకోపోతే ప్రయాణికులు కచ్చితంగా ఇబ్బంది పడతారు.

Indian Railways: రైల్వే శాఖ తాజాగా కొత్త రూల్స్ పెట్టింది. అవి తెలుసుకోపోతే ప్రయాణికులు కచ్చితంగా ఇబ్బంది పడతారు.

Railway ప్రయాణికులకు షాకింగ్ రూల్స్.. తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు!

ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పించేందుకు ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా పండగ సమయాల్లో రద్దీని తగ్గించడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా స్పెషల్​ ట్రైన్లు ఏర్పాటు చేస్తుంది. అయితే, తాజాగా ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్​ విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన రూల్స్ నవంబర్​ 1వ తేదీ 2024 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు తెలియకపోతే ప్రయాణాల్లో కచ్చితంగా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి, ఇక ఆ కొత్త రూల్స్​ ఏంటి? వాటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇది వరకు ప్రయాణానికి 120 రోజుల ముందుగానే అడ్వాన్స్​ బుకింగ్‌ చేసుకునే సౌకర్యం ఉంది..కానీ ఇప్పుడు ఆ సౌకర్యం లేదు. దానిని 60 రోజులకు ఇండియన్ రైల్వే తగ్గించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ రూల్స్ లో చేంజెస్ చేసింది. ఎందుకంటే గడువు ఎక్కువ ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ సంఖ్యలో క్యాన్సిలేషన్లు జరుగుతున్నాయట. ప్రస్తుతం 21శాతం జరిగాయట. ఇక 4-5శాతం మంది అసలు ప్రయాణమే చేయడం లేదని తేలింది. దీనివల్ల సీట్లు/బెర్తులు వృథాగా పోతున్నాయట. దీంతో పలు రకాల మోసాలు, రైల్వే అధికారులు అక్రమంగా డబ్బులు తీసుకోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తేలింది. ఈ నిర్ణయంతో వీటిని నిరోధించవచ్చని అని రైల్వే బోర్డు తెలిపింది. గడువు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది ముందస్తుగానే సీట్లను బ్లాక్‌ చేసుకొని తరువాత ప్రయాణించకుండా క్యాన్సిల్ చేసుకుంటున్నారట. అదే తక్కువ గడువు ఉంటే నిజంగా ప్రయాణించే వారికి అనువుగా ఉంటుందని తెలిపింది. అయితే, అక్టోబర్​ 31 నాటికి ఇలా బుక్​ చేసుకున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. నవంబర్ 1 నుంచే ఈ రూల్ ఉంటుంది.

అయితే తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ (Taj Express), గోమతి ఎక్స్‌ప్రెస్‌ (Gomti Express ) వంటి రైళ్ల బుకింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇప్పటికే వాటిలో బుకింగ్‌ వ్యవధి తక్కువగా ఉందని ఇండియన్ రైల్వే తెలిపింది. ఇక ఫారెన్ టూరిస్టులు 365 రోజుల ముందుగానే అడ్వాన్స్​ టికెట్‌ బుకింగ్‌ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే లగేజీ విషయంలో కఠిన రూల్స్ పెట్టింది రైల్వే బోర్డ్. పరిమితికి మించి లగేజీ తీసుకొస్తే కచ్చితంగా ఫైన్ కట్టాల్సి వస్తుందని రైల్వే శాఖ హెచ్చరించింది. ట్రైన్లో ఏ క్లాస్ కోచ్ లో ప్రయాణించినా కానీ పరిమితి ప్రకారమే ఫ్రీగా లగేజ్ పర్మిషన్ ఉంటుందని, అంతకు మించి తీసుకొస్తే భారీ జరిమానా తప్పదని స్పష్టం చేసింది. ఇదీ సంగతి.. కాబట్టి రైలు ప్రయాణం చేసేముందు కచ్చితంగా ఈ రూల్స్ గుర్తు పెట్టుకోండి. లేకుంటే ఇబ్బంది పడతారు. ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetHepyek girişmeritbetCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Girişmeritbet